NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Maldives China: భారత్‌తో వివాదం.. చైనా నుంచి మాల్దీవులకు ఉచిత సైనిక సాయం 
    తదుపరి వార్తా కథనం
    Maldives China: భారత్‌తో వివాదం.. చైనా నుంచి మాల్దీవులకు ఉచిత సైనిక సాయం 
    Maldives China: భారత్‌తో వివాదం.. చైనా నుంచి మాల్దీవులకు ఉచిత సైనిక సాయం

    Maldives China: భారత్‌తో వివాదం.. చైనా నుంచి మాల్దీవులకు ఉచిత సైనిక సాయం 

    వ్రాసిన వారు Stalin
    Mar 05, 2024
    10:39 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మాల్దీవులకు ఉచితంగా సైనిక సహాయం అందజేస్తామని చైనా ప్రకటించింది.

    దీనికి సంబంధించి ఇరు దేశాల మధ్య రక్షణ ఒప్పందం కూడా కుదిరింది.

    ఈ ఒప్పందం భారత్‌ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    విశేషమేమిటంటే, ముయిజు బీజింగ్‌లో పర్యటించిన కొద్ది వారాలకే రెండు దేశాల మధ్య రక్షణ ఒప్పందం జరగడం గమనార్హం.

    ముయిజ్జు చైనాలో పర్యంటించిన తర్వాతే.. మాల్దీవుల నుంచి భారత సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని అల్టిమేటం కూడా జారీ చేసిన విషయం తెలిసిందే.

    మొహమ్మద్ ముయిజ్జూ మాల్దీవులకు అధ్యక్షుడు అయిన కొద్ది రోజులకే భారతదేశం తన సైనికులను ఉపసంహరించుకోవలసి ఉంటుందని చెప్పారు.

    అలాగే విధానపరంగా, ముయిజ్జు చైనా ప్రభుత్వానికి చాలా సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు.

    మాల్దీవులు

    ఒప్పందం వివరాలను వెల్లడించని మాల్దీవులు

    మాల్దీవుల రక్షణ మంత్రి మహమ్మద్ ఘసన్ మౌమూన్, చైనా ఇంటర్నేషనల్ మిలిటరీ కోఆపరేషన్ డిప్యూటీ డైరెక్టర్ మేజర్ జనరల్ జాంగ్ బాకున్‌తో ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని పెంపొందించడంపై చర్చించారు.

    రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవ్స్‌తో బలమైన ద్వైపాక్షిక సంబంధాలను ప్రోత్సహించడానికి చైనా సైనిక సాయం అందించే ఒప్పందంపై సంతకాలు చేసినట్లు మాల్దీవుల రక్షణ మంత్రిత్వ శాఖ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

    అయితే ఈ రక్షణ సహకార ఒప్పందం వివరాలను మాల్దీవులు వెల్లడించలేదు.

    చైనా మిలిటరీ ప్రతినిధి బృందం ఇటీవల మాల్దీవుల రాజధాని మాలేను సందర్శించింది.

    జియాంగ్ యాంగ్ హాంగ్ 03 అనే హైటెక్ చైనీస్ రీసెర్చ్ షిప్‌ను మాలేలో అదుపులోకి తీసుకున్న తరుణంలో ఇరు దేశాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది.

    చైనా

    మాల్దీవులు-చైనా ఒప్పందంపై భారత్ ఎందుకు భయపడుతోంది? 

    ఈ ఒప్పందం తర్వాత చైనా యుద్ధనౌకలు మాల్దీవుల్లోని ఓడరేవుల్లో పాగా వేసే అవకాశం ఉంది.

    ఇది కాకుండా, చైనా నావికాదళం మాల్దీవులలో తన శాశ్వత లేదా తాత్కాలిక స్థావరాన్ని కూడా నిర్మించుకునే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం.

    దేశంలోని ప్రాదేశిక జలాలపై 24 గంటల పర్యవేక్షణ కోసం నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు ప్రకటించారు.

    అయితే మహ్మద్ ముయిజ్జు చెప్పిన నిఘా వ్యవస్థ చైనీస్ రాడార్ అయితే.. భారత్‌కు రక్షణ, నిఘా పరంగా మరింత ఇబ్బందులు తలెత్తుతాయి.

    చైనీస్ రాడార్ వ్యవస్థ భారతదేశ ప్రాదేశిక జలాలపై గూఢచర్యం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

    మాల్దీవులు, చైనా కలిసి హిందూ మహాసముద్రంలో భారత్‌కు కొత్త సమస్యలను సృష్టించే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మాల్దీవులు
    చైనా
    భారతదేశం
    తాజా వార్తలు

    తాజా

    Prof S Mahendra Dev: ప్రధానికి ఆర్థిక సలహామండలి ఛైర్మన్‌గా సూర్యదేవర మహేంద్రదేవ్‌    కేంద్ర ప్రభుత్వం
    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు

    మాల్దీవులు

    మాల్దీవుల్లో భారత హైకమిషన్‌పై దాడికి కుట్ర.. స్పందించిన విదేశాంగ శాఖ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి
    #Boycott Maldives: భారత్‌పై మాల్దీవ్స్ నేతల అక్కసు.. ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ మాల్దీవ్స్ హ్యాష్‌ట్యాగ్  లక్షదీవులు
    Maldives: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. ఇద్దరు మంత్రులను సస్పెండ్ చేసిన మాల్దీవులు సర్కార్  నరేంద్ర మోదీ
    Lakshadweep MP: మోదీ భారత పర్యాటకంపై స్పందిస్తే మాల్దీవులకు వచ్చిన సమస్య ఏంటి?: లక్షద్వీప్ ఎంపీ లక్షదీవులు

    చైనా

    2023లో తూర్పు ఆసియా వృద్ధి అంచనాలను తగ్గించిన ప్రపంచ బ్యాంకు  వృద్ధి రేటు
    News Click: చైనా నిధుల వివాదం.. 'న్యూస్ క్లిక్' ఆఫీసు, జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు దిల్లీ
    NewsClick case: న్యూస్‌క్లిక్ ఎడిటర్, హెచ్‌ఆర్‌కు 7 రోజుల పోలీసు రిమాండ్  దిల్లీ
    సముద్రపు ఉచ్చులో చైనా అణు జలాంతర్గామి.. 55మంది మృతి  జలాంతర్గామి

    భారతదేశం

    Drone Attack: ఎర్ర సముద్రంలో మరో భారత ఇంధన నౌకపై డ్రోన్‌ దాడి  డ్రోన్
    BSF: 2023లో పాకిస్థాన్ సరిహద్దులో 100 డ్రోన్‌లను కూల్చివేసిన బీఎస్ఎఫ్ పాకిస్థాన్
    FY24లో భారత ఆర్థిక వృద్ధి రేటు అంచనా 6.7శాతం  వృద్ధి రేటు
    India market: 2023లో 25శాతం లాభాలతో అధరగొట్టిన భారత స్టాక్ మార్కెట్  స్టాక్ మార్కెట్

    తాజా వార్తలు

    Missouri: నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన పోలీసులు, కోర్టు సిబ్బందిపై కాల్పులు.. ఇద్దరు మృతి  అమెరికా
    Maharashtra: 'ఇండియా' కూటమి పొత్తు ఖారారు.. 18స్థానాల్లో కాంగ్రెస్ పోటీ మహారాష్ట్ర
    LPG Cylinder Price: భారీగా గ్యాస్ సిలిండర్ ధర  గ్యాస్
    Himachal Pradesh: అనర్హత వేటుపై హైకోర్టుకు ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు  హిమాచల్ ప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025