
సూడాన్ సంక్షోభం: డ్రోన్ దాడిలో 43మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
సూడాన్ రాజధాని ఖార్టూమ్కు దక్షిణంగా ఉన్న బహిరంగ మార్కెట్పై ఆదివారం డ్రోన్ దాడి జరిగింది.
ఈ దాడిలో దాదాపు 43మంది చనిపోయారు. ఈ దాడిలో 55 మందికి పైగా గాయపడ్డారని సూడాన్ డాక్టర్స్ యూనియన్ ఒక ప్రకటనలో తెలిపింది. క్షతగాత్రులను బషైర్ యూనివర్సిటీ ఆస్పత్రికి తరలించారు.
సుడాన్ దేశంలో మిలిటరీ చీఫ్, పారామిలిటరీ బలగాల చీఫ్ మధ్య ఆదిపత్య పోరు నడుస్తోంది. ఈ రెండు వర్గాల మధ్య పరస్పర దాడులతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
ఈ దాడికి సైన్యానికి వైమానిక దళం కారణమని ఆర్ఎస్ఎఫ్ ఆరోపించింది. అయితే తాము ప్రజలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయలేదని సైన్యం ప్రకటించింది. ఆర్ఎస్ఎఫ్ ఆరోపణలను ఖండించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
55మందికి గాయాలు
Sudan: Drone attack on open market in capital, #Khartoum, killed at least 43 people amid the military and rival paramilitary group battle for control of the country. Sudan Doctors’ Union says more than 55 others wounded in the attack where paramilitary forces battling the…
— All India Radio News (@airnewsalerts) September 11, 2023