Page Loader
ఇజ్రాయెల్ పర్యాటకులపై ఈజిప్టు పోలీసులు కాల్పులు.. ఇద్దరు మృతి 
ఇజ్రాయెల్ పర్యాటకులపై ఈజిప్టు పోలీసులు కాల్పులు.. ఇద్దరు మృతి

ఇజ్రాయెల్ పర్యాటకులపై ఈజిప్టు పోలీసులు కాల్పులు.. ఇద్దరు మృతి 

వ్రాసిన వారు Stalin
Oct 08, 2023
05:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నగరంలో ఒక పోలీసు అధికారి ఇజ్రాయెల్ పర్యాటకుల బృందంపై ఆదివారం కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు ఇజ్రాయెలీలు, ఒక ఈజిప్షియన్ మరణించారు. మరో వ్యక్తి గాయపడ్డాడు. అలెగ్జాండ్రియాలోని పాంపీస్ పిల్లర్ సైట్ వద్ద ఈ ఘటన జరిగింది. ఇజ్రాయెల్, పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఇజ్రాయెల్- ఈజిప్టు మధ్య సరిహద్దు వివాదం ఉన్న విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన వెంటనే భద్రతా బలగాలు కాల్పులు జరిపిన వ్యక్తిని చుట్టుముట్టాయి. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నాయి. గాయపడిన ఇజ్రాయిల్‌ పర్యాటకుడిని సమీపంలోకి ఆస్పత్రికి తరలించారు. ఈ కాల్పులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కాల్పులు జరిపిన ప్రదేశంలోని దృశ్యాలు