'Economic D-Day':ఇరాన్పై ఆర్థిక దాడికి అమెరికా సిద్ధం.. 'ఎకనామిక్ డీ-డే' ప్రకటించిన బెసెంట్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇరాన్పై ఆర్థిక ఒత్తిడిని మరింత తీవ్రతరం చేసేందుకు సిద్ధమవుతోంది. అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఈ చర్యను 'ఆర్థిక డీ-డే'(Economic D-Day)గా అభివర్ణించారు. ఇరాన్కు ఆర్థికంగా తీవ్ర నష్టం కలిగించి,ఆ దేశంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా అమెరికా తదుపరి చర్యలు ఉండనున్నట్లు ఆయన వెల్లడించారు. బెసెంట్ తన ట్విట్టర్ ఖాతాలో చేసిన ప్రకటన ప్రకారం.. ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే ఇరాన్ సైనిక సామర్థ్యాలను దెబ్బతీసిందని, ఆ దేశంలోని సైనిక తయారీ కేంద్రాలను 100 శాతానికి పైగా ధ్వంసం చేసిందని, అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని పేర్కొన్నారు. ''మనం ఇప్పుడు చివరి దశలోకి ప్రవేశిస్తున్నాం. ఉదయం ఆర్థిక డీ-డే ప్రారంభమవుతుంది'' అని ఆయన తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
స్కాట్ బెసెంట్ చేసిన ట్వీట్
President Trump has dismantled Iran’s military capabilities, destroyed nearly 100 percent of its military factories, and buried its nuclear program.
— Treasury Secretary Scott Bessent (@SecScottBessent) August 23, 2026
We are now entering the endgame. At dawn begins an economic D-Day — the single greatest financial offensive ever marshaled against…
వివరాలు
ఆర్థిక జీవనరేఖలను తెంచడమే మా లక్ష్యం: బెసెంట్
ఇరాన్ తన ఆర్థిక, భద్రతా వ్యవస్థలను ఆధారంగా చేసుకుని కొనసాగుతోందని బెసెంట్ ఆరోపించారు.
గతంలో ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటుందని తెలిసినా అమెరికా చర్యలను అమలు చేయడంపై చర్చించేందుకు అవకాశం ఉండేదని, అయితే ''ట్రంప్ అధ్యక్షతలో ఆ కాలం ముగిసింది'' అని వ్యాఖ్యానించారు.
అవసరమైన చర్యలు తీసుకునేందుకు ''ప్రతి ఏజెన్సీ, ప్రతి అధికారాన్ని'' ఉపయోగించే పరిస్థితులను ట్రంప్ ప్రభుత్వం సిద్ధం చేసిందన్నారు.
''ఈ క్రూర పాలనకు ఆర్థిక జీవనరేఖలను తెంచడమే మా లక్ష్యం'' అని బెసెంట్ స్పష్టం చేశారు.
వాషింగ్టన్-తెహ్రాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.
ఇరాన్ను నియంత్రించేందుకు ఆర్థిక ఒత్తిడి ట్రంప్ ప్రభుత్వ వ్యూహంలో కీలక భాగంగా ఉండబోతోందనే సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి.
వివరాలు
మొహ్సెన్ రెజాయీ హెచ్చరిక
ఇదిలా ఉండగా.. అమెరికా ఆర్థిక యుద్ధాన్ని కొనసాగిస్తే ఇరాన్ కీలకమైన హార్మూజ్ జలసంధి, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల నుంచి చమురు ఎగుమతులను పూర్తిగా నిలిపివేయవచ్చని హెచ్చరించింది.
ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ ట్విట్టర్లో ఈ హెచ్చరిక చేశారు.
అమెరికా ఆర్థిక యుద్ధంలో పాల్గొనే లేదా దానికి మద్దతు ఇచ్చే ఏ దేశాన్నైనా ఇరాన్ యుద్ధ చర్యగా పరిగణిస్తుందని తెలిపారు.
''ఈ ఆర్థిక యుద్ధం కొనసాగితే.. ఒక్క చుక్క చమురు కూడా ఎగుమతి కాదు. హార్మూజ్ జలసంధి ద్వారా కానీ, పర్షియన్ గల్ఫ్లోని మరే ప్రాంతం నుంచి కానీ చమురు బయటకు వెళ్లదు'' అని రెజాయీ హెచ్చరించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మొహ్సెన్ రెజాయీ చేసిన ట్వీట్
Iran will treat any country’s participation in or support for the US economic campaign against Tehran as an act of war and could halt all oil exports from the Persian Gulf, Secretary of Iran’s Supreme National Security Council Mohsen Rezaei said on Sunday.
— Iran International English (@IranIntl_En) August 23, 2026
“If the economic war… pic.twitter.com/z58w9uXMSb
వివరాలు
'ఫ్రోజెన్ ఆర్థిక విధానం.. ఫ్రోజెన్ ఆర్థిక వ్యవస్థను అందిస్తుంది'
ట్రంప్ తాజా ఆంక్షల హెచ్చరికపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగర్ ఘలిబాఫ్ వ్యంగ్యంగా స్పందించారు.
తాత్కాలిక ప్రభుత్వ జోక్యంతో ఆర్థిక ఒత్తిడిని తగ్గించే చర్యలు తీసుకోవచ్చని పేర్కొంటూ.. మాంసం ధరలు తగ్గించేందుకు ఫ్రోజెన్ మాంసం దిగుమతి చేసుకోవడం సాధ్యమేనని,మరి బాండ్ల కోసం 'ఫ్రోజెన్ యీల్డ్స్', ఇళ్ల కోసం 'ఫ్రోజెన్ హోంబయర్స్', జీతాల కోసం 'ఫ్రోజెన్ పేచెక్లు' దిగుమతి చేస్తారా అంటూ ప్రశ్నించారు.
'ఫ్రోజెన్ ఆర్థిక విధానం.. ఫ్రోజెన్ ఆర్థిక వ్యవస్థను అందిస్తుంది' అంటూ విమర్శించారు.
అమెరికా ఆంక్షల బెదిరింపుపై ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయీ కూడా స్పందించారు.
యుద్ధం, ఆంక్షలు ఇరాన్కు కొత్తేమీ కాదని చెప్పారు. గత 20 ఏళ్లుగా తమ దేశం ఆంక్షలను ఎదుర్కొంటోందని పేర్కొన్నారు.
వివరాలు
ఇరాన్ను ఒంటరిగా చేయడంలో కలిసి రండి: అమెరికా
ట్రంప్ బుధవారం ఇరాన్పై 'ఆర్థిక డీ-డే' ప్రచారాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
తాను ప్రతిపాదించిన చర్యలను ఏ దేశంపైనైనా తీసుకునే అత్యంత కఠినమైన ఆర్థిక చర్యలుగా ట్రంప్ అభివర్ణించారు.
ఇరాన్ను ఒంటరిగా చేయడంలో అమెరికాతో కలిసి రావాలని మిత్రదేశాలను కోరారు.
"మా వద్ద ఇప్పటికే అత్యంత కఠినమైన ఆంక్షలు ఉన్నాయి.ఇక పరిణామాలు ఎలా ఉంటాయో చూద్దాం'' అని ట్రంప్ అన్నారు.
పరిస్థితులు ఎలా మారుతాయన్న దానిపై ఆధారపడి తదుపరి చర్యలను నిర్ణయిస్తామని చెప్పారు.
చమురు ధరలు భారీగా పడిపోవడానికి దారితీసే చర్యలు తీసుకోవచ్చని,లేదంటే ప్రస్తుతం అమలు చేస్తున్న చర్యలను కొనసాగించవచ్చని సంకేతాలు ఇచ్చారు.
మరోవైపు.. అమెరికా కొత్త ఆంక్షలు చమురు ధరలను మరింత పెంచే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
వివరాలు
ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం
ఇప్పటికే వరుసగా నాలుగు రోజులుగా చమురు ధరలు పెరిగినట్లు సమాచారం.
హార్మూజ్ జలసంధి, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల నుంచి చమురు ఎగుమతులను ఇరాన్ నిలిపివేస్తే ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
ఇరాన్కు ఆర్థిక లేదా వాణిజ్యపరమైన మద్దతు ఇచ్చే దేశాలు కూడా తీవ్రమైన ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు.
ఇరాన్ను అంతర్జాతీయంగా ఒంటరిచేసేందుకు అమెరికాతో కలిసి పనిచేయాలని తన మిత్రదేశాలకు పిలుపునిచ్చారు.
దీంతో అమెరికా-ఇరాన్ మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలు ఆర్థిక, వాణిజ్య రంగాలకు కూడా విస్తరించే పరిస్థితి నెలకొంది.