Page Loader
Iran Port Fire: ఇరాన్‌లోని ఓడరేవులో పేలుడు.. 25 మంది మృతి.. 750మందికి గాయాలు
ఇరాన్‌లోని ఓడరేవులో పేలుడు.. 25 మంది మృతి.. 750మందికి గాయాలు

Iran Port Fire: ఇరాన్‌లోని ఓడరేవులో పేలుడు.. 25 మంది మృతి.. 750మందికి గాయాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 27, 2025
01:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌లోని ఓ ఓడరేవులో చోటుచేసుకున్న పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. ఇప్పటి వరకు 25 మంది మరణించారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. 750 మంది తీవ్రంగా గాయపడ్డారని కూడా వెల్లడించారు. ఈ ఘటన దక్షిణ ఇరాన్‌లోని అతిపెద్ద నౌకాశ్రయ సమీపంలో జరిగింది. పేలుడు ధాటికి సమీప భవనాల అద్దాలు ధ్వంసమై, ఒక భవనం నేలకూలింది.

Details

దర్యాప్తు కొనసాగుతోంది

దట్టమైన నల్లటి పొగ వ్యాపించడంతో, సమీపంలోని పాఠశాలలు, కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేశారు. ఈ ఘటనపై ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ వివరణ ఇచ్చారు. ఇది దాడి కాదని, పోర్టులో నిల్వ ఉన్న కొన్ని కంటైనర్లలో పేలుడు జరిగిందని పేర్కొన్నారు. అయితే ఈ ప్రమాదం కారణాలను ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.