Page Loader
Texas Floods: టెక్సాస్‌లో వరదలు.. 25 మంది బాలికలు గల్లంతు
టెక్సాస్‌లో వరదలు.. 25 మంది బాలికలు గల్లంతు

Texas Floods: టెక్సాస్‌లో వరదలు.. 25 మంది బాలికలు గల్లంతు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 05, 2025
08:55 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని కొద్ది రోజులుగా అతిపెద్ద వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. తీవ్ర వర్షాల ప్రభావంతో గ్వాడాలుపే నది పొంగిపొర్లి వరదలు ముంచెత్తాయి. ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు 24 మంది ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా 20 మందికి పైగా బాలికలు గల్లంతయ్యారని స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి రెస్క్యూ బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. వర్షాల ధాటికి హంట్ ప్రాంతంలోని గ్వాడాలుపే నది దాటదాటలుగా ప్రవహిస్తోంది. ఫలితంగా పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. అనేక ఇళ్లకు వరదనీరు చొచ్చుకొచ్చింది. వీధులు కూడా జలమయమయ్యాయి.

Details

పడవలు, హెలికాప్టర్ల సాయంతో విస్తృతంగా గాలింపు

ఇప్పటివరకు 200 మందికి పైగా ప్రజలను రెస్క్యూ బృందాలు సురక్షితంగా బయటకు తీసివేశాయి. ఈ వరదల్లో ముఖ్యంగా గ్వాడాలుపే నదీ తీరంలో ఉన్న ఓ ప్రముఖ క్రిస్టియన్ క్యాంప్ తీవ్రంగా ప్రభావితమైంది. వేసవి సెలవుల సందర్భంగా అక్కడ నిర్వహిస్తున్న శిక్షణ శిబిరంలో సుమారు 23 నుంచి 25 మంది బాలికలు గల్లంతయ్యారు. ఇది గమనించిన తల్లిదండ్రులు భయాందోళనకు గురై, తమ పిల్లల ఆచూకీ కోసం సోషల్ మీడియా వేదికగా ఫొటోలు షేర్ చేస్తూ సహాయం కోరుతున్నారు. ప్రస్తుతం రెస్క్యూ సిబ్బంది గల్లంతైన బాలికల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. పడవలు, హెలికాప్టర్ల సాయంతో విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.