NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / నాలుగోరోజూ అట్టుడుకుతున్న ఫ్రాన్స్; 45,000మంది సైనికులు మోహరింపు
    తదుపరి వార్తా కథనం
    నాలుగోరోజూ అట్టుడుకుతున్న ఫ్రాన్స్; 45,000మంది సైనికులు మోహరింపు
    నాలుగోరోజూ అట్టుడుకుతున్న ఫ్రాన్స్; 45,000మంది సైనికులు మోహరింపు

    నాలుగోరోజూ అట్టుడుకుతున్న ఫ్రాన్స్; 45,000మంది సైనికులు మోహరింపు

    వ్రాసిన వారు Stalin
    Jul 01, 2023
    01:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నాలుగో రోజు కూడా ఫ్రాన్స్‌ అట్టుడుకుతోంది. ఇప్పుడు ఫ్రెంచ్ కరేబియన్ భూభాగాలకు కూడా ఈ ఆందోళనలు వ్యాపించాయి.

    దోపిడీలు, అల్లర్లు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసంతో దేశం మొత్తం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు 'ఫ్రాన్స్ 24' మీడియా సంస్థ తెలిపింది.

    'ఫ్రాన్స్ 24' అనేది పారిస్‌లో ఉన్న ఫ్రెంచ్ ప్రభుత్వ యాజమాన్యంలోని అంతర్జాతీయ న్యూస్ టెలివిజన్ నెట్‌వర్క్.

    జూన్ 27న ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించాడని 17 ఏళ్ల నహేల్‌ను పారిస్ శివారు పట్టణమైన నాంటెర్‌లో పోలీసులు కాల్చి చంపడం తర్వాత ఫ్రాన్స్ ఆందోళనలు మొదలయ్యాయి.

    మరో రాత్రి అల్లర్లు జరిగే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఇప్పటికే 45,000 మంది సైనికులను మోహరించారు. మరో 5వేల మందిని మోహరించేందుకు సిద్ధమవుతున్నారు.

    ఫ్రాన్స్

    ఇప్పటి వరకు 1,100మందికి పైగా అరెస్టు

    ఫ్రెంచ్ అంతర్గత మంత్రి గెరాల్డ్ డార్మానిన్ మాట్లాడుతూ, శుక్రవారం రాత్రి మరో 270 మందిని అరెస్టు చేశామని, వారిలో 80 మందిని మార్సెయిల్‌లోనే పట్టుబడినట్లు చెప్పారు.

    ఈ అల్లర్లు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్త 11,00 మందికి అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

    నాంటెర్రేలో నిరసనకారులు ఒక బ్యాంకుకు నిప్పంటించారు. మార్సెయిల్‌లో పోలీసు అధికారులపై నిరసనకారులు బాణాసంచా విసిరారు.

    స్ట్రాస్‌బర్గ్‌లోని ఆపిల్ స్టోర్‌ను నిరసనకారులు దోపిడీకి పాల్పడ్డారు. యాపిల్ స్టోర్ నుంచి యువ అల్లరిమూకలను తరిమికొట్టేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు.

    ఫ్రాన్స్

    ఫ్రాన్ విదేశీ భూభాగాలకు వ్యాపించిన అల్లర్లు

    అల్లరిమూకలు శుక్రవారం సాయంత్రం తుపాకీ దుకాణాన్ని ధ్వంసం చేసి, ఆయుధాలతో దాడి చేశారు.

    ఈ క్రమంలో రైఫిల్‌తో వెళ్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫ్రెంచ్ ప్రధాన భూభాగంలోనే మాత్రమే కాకుండా ఫ్రాన్ విదేశీ భూభాగాలకు కూడా అల్లర్లు వ్యాపించాయి.

    ఫ్రెంచ్ గయానా ద్వీపం రాజధాని కయెన్‌లో నిరసనకారులు, పోలీసు బలగాల మధ్య జరిగిన ఘర్షణల సమయంలో ఒక 54 ఏళ్ల వ్యక్తి బుల్లెట్‌కు తగిలి మరణించారు.

    నిరసనకారులు చిన్న హిందూ మహాసముద్ర ద్వీపమైన రీయూనియన్‌లో చెత్త డబ్బాలను తగులబెట్టారు. కార్లు, భవనాలను ధ్వంసం చేశారు.

    ఫ్రాన్స్

    అత్యవసర పరిస్థితిని ప్రకటించే ఆలోచనలో అధ్యక్షుడు మాక్రాన్

    పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు అత్యవసర పరిస్థితిని ప్రకటించడం సహా అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కార్యాలయం ప్రకటించింది.

    2005లో అప్పటి అధ్యక్షుడు జాక్వెస్ చిరాక్ ఎమర్జెన్సీ విధించినప్పుడు జరిగిన అల్లర్ల తరహాలోనే ప్రస్తుత పరిస్థితి నెలకొంది.

    మెటా, ట్విట్టర్, స్నాప్‌చాట్, టిక్‌టాక్ ప్రతినిధులను కూడా కలిసిన ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, వాటిపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు.

    అయితే అల్లర్లలో ఎక్కువశాతం యువకులే పాల్గొంటున్న నేపథ్యంలో ఫ్రెంచ్ ప్రభుత్వం కలవర పడుతోంది.

    అయితే టీనేజర్లను తల్లిదండ్రులు బయటికి పంపొద్దని ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఫ్రాన్స్‌‌లో అల్లర్ల దృశ్యాలు

    #France#FranceRiots #FranceViolence

    Just in:
    Latest Violence in France.
    😔 pic.twitter.com/VVIcz8qh4c

    — 🇮🇳 Alok (@alokdubey1408) June 29, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఫ్రాన్స్
    తాజా వార్తలు

    తాజా

    Operation Sindoor: ఉగ్రవాదంపై పాక్‌ పాత్రను ప్రపంచానికి చెప్పేందుకు ఏడుగురు ప్రతినిధులు సిద్ధం భారతదేశం
    Nayanthara: మెగాస్టార్-లేడీ సూపర్ స్టార్ కాంబో ఫిక్స్.. ధ్రువీకరించిన మూవీ టీం నయనతార
    Boycott turkey: 'బాయ్‌కాట్‌ తుర్కియే' ఉద్యమానికి మద్దతుగా మింత్రా, అజియో కీలక నిర్ణయం ఆపరేషన్‌ సిందూర్‌
    Donald Trump: వలసదారులపై సుప్రీం తీర్పు అమెరికాకు ముప్పు: ట్రంప్‌ ఫైర్ డొనాల్డ్ ట్రంప్

    ఫ్రాన్స్

    సిస్టర్ ఆండ్రీ : ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు కన్నుమూత అంతర్జాతీయం
    కార్బన్-ఫైబర్ ప్యానెల్స్‌తో రెస్టో-మోడెడ్ 1602 ను ప్రదర్శించిన BMW కార్
    'ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతల్లో ప్రధాని మోదీ నంబర్ 1' నరేంద్ర మోదీ
    8 మందిపై క‌త్తితో విరుచుకుపడ్డ సైకో.. ముగ్గురు చిన్నారుల పరిస్థితి ఆందోళనకరం ప్రపంచం

    తాజా వార్తలు

    బీజేపీ మీటింగ్‌లో కాల్పుల కలకలం; కార్యకర్తకు గాయాలు  బీజేపీ
    ఇక కోర్టులోనే పోరాటం; ఆందోళన విరమించిన రెజ్లర్లు  రెజ్లింగ్
    ఒడిశాలో పెండ్లి బస్సు- ఆర్టీసీ బస్సు ఢీ; 12మంది దుర్మరణం  ఒడిశా
    భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న స్నేహితుడి గొంతు కోసి, రక్తం తాగాడు కర్ణాటక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025