Green Card Rules: గ్రీన్ కార్డ్ ఆశావహులకు షాక్.. సెప్టెంబర్ 18 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి..
ఈ వార్తాకథనం ఏంటి
గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది భారతీయులకు అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు కీలకంగా మారనున్నాయి. శాశ్వత నివాస అనుమతి కోసం దరఖాస్తు చేసుకునే వారి ఆర్థిక పరిస్థితి, వారు గతంలో పొందిన ప్రభుత్వ ప్రయోజనాలను అధికారులు మరింత లోతుగా పరిశీలించనున్నారు. 'పబ్లిక్ ఛార్జ్' నిబంధనను పునరుద్ధరిస్తూ జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు సెప్టెంబర్ 18 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో గ్రీన్ కార్డ్ దరఖాస్తు ప్రక్రియ మరింత కఠినంగా మారే అవకాశం ఉంది. ఈ కొత్త మార్గదర్శకాలను యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) ప్రకటించింది.
వివరాలు
ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందిన వారిపై ప్రధానంగా ప్రభావం
కొత్త నిబంధనల ప్రకారం.. గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ప్రభుత్వ గృహ వసతి సహాయం, ఫుడ్ స్టాంప్స్, కళాశాల విద్యకు సంబంధించిన ఆర్థిక సాయం వంటి సంక్షేమ ప్రయోజనాలు పొందారా? అనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తారు.
భవిష్యత్తులో ఆ వ్యక్తి ప్రభుత్వంపై ఆర్థికంగా ఆధారపడే అవకాశం ఉందా? అనే విషయాన్ని కూడా అంచనా వేస్తారు.
బైడెన్ ప్రభుత్వం 2022లో తీసుకొచ్చిన నిబంధనలను తొలగిస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ జులై 16న కొత్త తుది నిబంధనలను ప్రకటించింది.
సెప్టెంబర్ 18న లేదా ఆ తర్వాత పోస్ట్మార్క్ చేసిన లేదా ఆన్లైన్లో సమర్పించిన గ్రీన్ కార్డ్ దరఖాస్తులకు, అంటే ఫారం I-485లకు, ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి.
వివరాలు
ఇప్పటికే గ్రీన్ కార్డ్ పొందినవారికి,ఈ నిబంధనలు వర్తించవు
అయితే 2022 డిసెంబర్ 23 నుంచి 2026 సెప్టెంబర్ 17 మధ్య దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రం 2022లో అమల్లో ఉన్న నిబంధనల ప్రకారమే గ్రీన్ కార్డ్ ప్రక్రియ కొనసాగుతుంది.
తాజా మార్పులతో కుటుంబ ఆధారిత, ఉద్యోగ ఆధారిత కేటగిరీల్లో గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసే భారతీయులపై ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
ఇప్పటికే గ్రీన్ కార్డ్ పొందినవారికి, అలాగే అమెరికా పౌరులకు ఈ నిబంధనలు వర్తించవు.
వివరాలు
ఎవరిపై ప్రభావం ఉంటుంది?
అమెరికా పౌరుల జీవిత భాగస్వాములు, పిల్లలు, తల్లిదండ్రులు ఈ 'పబ్లిక్ ఛార్జ్' పరిశీలన పరిధిలోకి వస్తారు. అలాగే శాశ్వత నివాసితుల జీవిత భాగస్వాములు,పిల్లల దరఖాస్తులను కూడా అధికారులు పరిశీలిస్తారు.
ఉద్యోగ ఆధారిత వర్గాల్లో ప్రాధాన్యత కలిగిన ఉద్యోగులు,ఉన్నత విద్యా డిగ్రీలు ఉన్న నిపుణులు, అసాధారణ ప్రతిభ కలిగిన వ్యక్తులు, నైపుణ్యం కలిగిన కార్మికులు,పెట్టుబడిదారులు,మత కార్యకర్తలు వంటి కేటగిరీలకు చెందిన వారికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి.
అయితే కొన్ని మానవతా, ప్రత్యేక వలస వర్గాలకు మినహాయింపు ఉంది.
శరణార్థులు, ఆశ్రయం పొందినవారు,మానవ అక్రమ రవాణా బాధితులు, అలాగే వయొలెన్స్ ఎగైనెస్ట్ ఉమెన్ యాక్ట్ (VAWA) కింద స్వీయ-పిటిషనర్లు ఈ 'పబ్లిక్ ఛార్జ్' నిబంధన నుంచి మినహాయింపు పొందుతారు. ఈ మినహాయింపులను కాంగ్రెస్ ఇప్పటికే నిర్దేశించింది.
వివరాలు
అధికారులు ఏ అంశాలను పరిశీలిస్తారు?
గ్రీన్ కార్డ్ దరఖాస్తును పరిశీలించే సమయంలో అధికారులు ఐదు ప్రధాన అంశాలపై దృష్టి పెడతారు.
దరఖాస్తుదారుడి వయసు, ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులు, ఆస్తులు-ఆర్థిక స్థితి, విద్య-నైపుణ్యాలు ఇందులో ఉన్నాయి.
వీటితో పాటు దరఖాస్తుదారుడికి ఆర్థికంగా మద్దతు ఇచ్చే స్పాన్సర్ సమర్పించే అఫిడవిట్ ఆఫ్ సపోర్ట్ (ఫారం I-864)ను కూడా అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు.
అయితే ఒక వ్యక్తి ఏదైనా ఒక్క ప్రభుత్వ ప్రయోజనం పొందాడనే కారణంతోనే అతడి గ్రీన్ కార్డ్ దరఖాస్తును తిరస్కరించరు.
దరఖాస్తుదారుడి మొత్తం పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే అధికారులు తుది నిర్ణయం తీసుకుంటారు.
ఒకవేళ 'పబ్లిక్ ఛార్జ్'గా పరిగణించే అవకాశం ఉందని అధికారులు భావిస్తే, దరఖాస్తుదారుడికి
వివరాలు
అధికారులు ఏ అంశాలను పరిశీలిస్తారు?
గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 66,800 మంది భారతీయులు గ్రీన్ కార్డులు పొందారు.
వీరిలో దాదాపు 61 శాతం మంది ఇప్పటికే అమెరికాలో నివసిస్తూ తమ ఇమ్మిగ్రేషన్ స్టేటస్ను మార్చుకున్నవారే.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 18 నుంచి అమల్లోకి రానున్న కొత్త 'పబ్లిక్ ఛార్జ్' నిబంధనలు గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న భారతీయులకు కీలకమైన మార్పుగా మారనున్నాయి.