
Bangkok: బ్యాంకాక్ ఆహార మార్కెట్'లో కాల్పులు.. ఆరుగురి మృతి
ఈ వార్తాకథనం ఏంటి
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో ఓ దుండగుడు కాల్పులకు తెగపడ్డాడు. ఈ దాడిలో మొత్తం ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం అదే వ్యక్తి తనపై తానే తుపాకీతో కాల్చుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని, స్థితిని సమీక్షిస్తూ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు సేకరించేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బ్యాంకాక్ ఆహార మార్కెట్'లో కాల్పులు
A gunman opened fire at Bangkok’s Or To Ko market on Monday, killing 5 people—4 security guards and a woman—before taking his own life, police said. The market is known for selling local produce. Authorities confirmed the total death toll stands at six. pic.twitter.com/ahfMdddoFc
— BigBreakingWire (@BigBreakingWire) July 28, 2025
వివరాలు
నలుగురు సెక్యూరిటీ గార్డులు,ఒక మహిళ మృతి
స్థానిక మీడియా వర్గాల సమాచారం ప్రకారం, బ్యాంకాక్లోని ఓర్ టు కో మార్కెట్లోకి ఓ సాయుధు దుండగుడు ప్రవేశించి కాల్పులు జరిపాడు. ఈ దాడిలో నలుగురు సెక్యూరిటీ గార్డులు, ఒక మహిళ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన చతుచక్ మార్కెట్ సమీపంలో జరిగిందన్న విషయం మరింత కలవరానికి గురి చేసింది. దీంతో అక్కడి నివాసితులు, పర్యాటకులకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
వివరాలు
థాంగ్ జిల్లా పరిధిలోని ఓ పాఠశాల సమీపంలో కాల్పులు
ఈ కాల్పుల ఘటనకు థాయ్లాండ్, కంబోడియా సరిహద్దుల్లో జరుగుతున్న ఉద్రిక్తతలకు సంబంధం ఉందా అన్న కోణంలో కూడా అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గడచిన కొంత కాలంగా బ్యాంకాక్ ప్రాంతంలో ఇలాంటి హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. మే నెలలో కూడా థాంగ్ జిల్లా పరిధిలోని ఓ పాఠశాల సమీపంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.