NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Earthquake: నేపాల్-టిబెట్‌ సరిహద్దు భారీ భూకంపం.. 53 మంది మృతి
    తదుపరి వార్తా కథనం
    Earthquake: నేపాల్-టిబెట్‌ సరిహద్దు భారీ భూకంపం.. 53 మంది మృతి
    నేపాల్-టిబెట్‌ సరిహద్దు భారీ భూకంపం.. 53 మంది మృతి

    Earthquake: నేపాల్-టిబెట్‌ సరిహద్దు భారీ భూకంపం.. 53 మంది మృతి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 07, 2025
    11:04 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నేపాల్‌-టిబెట్‌ సరిహద్దును భారీ భూకంపం వణికించింది. మంగళవారం ఉదయం 7.1 తీవ్రతతో జరిగిన ఈ భూకంపం కారణంగా మృతుల సంఖ్య పెరుగుతూ ఉంది.

    ఇప్పటివరకు టిబెట్‌లో కనీసం 53 మంది మరణించినట్లు చైనా అధికారిక మీడియా తెలిపింది. మరో 62 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరగనున్నట్లు తెలిసింది.

    ఈ భూకంపం మంగళవారం ఉదయం 6:35 గంటలకు నేపాల్‌-టిబెట్‌ సరిహద్దు వద్ద ఉన్న లబుచె ప్రాంతంలో సంభవించింది.

    టిబెట్‌లోని షిజాంగ్‌లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించారు. తీవ్ర ప్రకంపనల కారణంగా ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

    Details

    టిబెట్ లో మరో రెండు ప్రకంపనలు

    భూకంపం అనంతరం టిబెట్‌లో మరో రెండు ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

    ఇవి 4.7, 4.9 తీవ్రతతో నమోదయ్యాయి. టిబెట్ ప్రాంతంలో పలు భవనాలు నేలమట్టమయ్యాయి.

    శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. భారత్‌లోనూ ఈ ప్రకంపనల ప్రభావం కనిపించింది. దిల్లీ-ఎన్‌సీఆర్‌, పశ్చిమ బెంగాల్‌, బిహార్ తదితర ప్రాంతాల్లో భూమి కంపించినట్లు తెలిపారు.

    చైనా, భూటాన్, బంగ్లాదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. చైనాలో భూకంప తీవ్రత 6.8గా నమోదైంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నేపాల్
    ప్రపంచం

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    నేపాల్

    నేపాల్‌ విమాన ప్రమాదం: ఐదుగురు భారతీయులు సహా 15మంది విదేశీ ప్రయాణికులు దుర్మరణం విమానం
    నేపాల్ విమాన ప్రమాదం: చనిపోవడానికి ముందు ఫేస్‌బుక్ లైవ్, ఆ నలుగురూ స్నేహితులే! విమానం
    నేపాల్ విమాన ప్రమాదం: కీలకమైన రెండు బ్లాక్ బాక్స్‌లు స్వాధీనం విమానం
    ఈ దేశాల్లో మన రూపాయి వీలువ చాలా ఎక్కువ, అవేంటో తెలుసా? జీవనశైలి

    ప్రపంచం

    Cop conference: అభివృద్ధి చెందిన దేశాలు ముందుకు రావాలి.. భారత్‌ హెచ్చరిక భారతదేశం
    Britain Royal Family: రాజ కుటుంబం భవనంలో దొంగతనం కలకలం.. క్యాజిల్ భద్రతపై ప్రశ్నలు బ్రిటన్
    PF Pension: 60 ఏళ్ల వయసులో పెన్షన్ లెక్కింపు.. ఎంత డబ్బు వస్తుందో తెలుసా? భారతదేశం
    International Men's Day 2024: మగవారికి ప్రత్యేక సూచనలు.. ఈ విషయాలపై దృష్టి సారించండి ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025