NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Israel: ఏడాదిలో 728 మంది ఇజ్రాయెల్‌ సైనికులు మృతి.. కీలక డేటా వెల్లడించిన ఐడీఎఫ్‌ 
    తదుపరి వార్తా కథనం
    Israel: ఏడాదిలో 728 మంది ఇజ్రాయెల్‌ సైనికులు మృతి.. కీలక డేటా వెల్లడించిన ఐడీఎఫ్‌ 
    ఏడాదిలో 728 మంది ఇజ్రాయెల్‌ సైనికులు మృతి.. కీలక డేటా వెల్లడించిన ఐడీఎఫ్‌

    Israel: ఏడాదిలో 728 మంది ఇజ్రాయెల్‌ సైనికులు మృతి.. కీలక డేటా వెల్లడించిన ఐడీఎఫ్‌ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 07, 2024
    10:19 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్) కీలక సమాచారం విడుదల చేసింది.

    గాజా పట్టణంలో 17,000 మంది హమాస్ ఆపరేటివ్‌లను, ఇజ్రాయెల్‌లో 1,000 మంది ఉగ్రవాదులను నాశనం చేశామని ప్రకటించింది.

    ఈ గ్రూపును పూర్తిగా ధ్వంసం చేసినట్లు తెలిపింది. వీరిలో 30 మంది హమాస్ బెటాలియన్‌, 165 మంది కంపెనీ కమాండర్లు ఉన్నారని పేర్కొంది.

    గాజా ప్రాంతంలో 40,300 లక్ష్యాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపామని మొత్తం 4,700 సొరంగ ప్రవేశ మార్గాలను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది.

    అక్టోబర్ 8న లెబనాన్‌లోని హెజ్‌బొల్లా వారి మీద దాడులు ప్రారంభించారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

    వివరాలు 

    11,000 హెజ్‌బొల్లా స్థావరాలు పేల్చిన ఇజ్రాయెల్

    దీని ద్వారా 800 మంది హెజ్‌బొల్లా సభ్యులను మట్టుబెట్టామని, వారిలో 90 మంది టాప్ కమాండర్లు ఉన్నారని పేర్కొంది. అదే సమయంలో 11,000 హెజ్‌బొల్లా స్థావరాలను పేల్చినట్లు వివరించింది.

    ఏడాది కాలంలో 26,000 రాకెట్లతో దాడులు జరిగాయని, ఇందులో 13,200 రాకెట్లు గాజా నుంచి, 12,400 రాకెట్లు లెబనాన్ నుంచి వచ్చాయని,మిగతా రాకెట్లు యెమన్, సిరియా, ఇరాన్ నుంచి ప్రయోగించబడినట్లు వెల్లడించింది.

    వీటిలో కొన్ని రాకెట్లు ఆయా ప్రాంతాల్లోనే కూలిపోయాయని తెలిపింది. మొత్తం 728 మంది తమ సైనికులు, రిజర్విస్టులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది.

    వివరాలు 

    హమాస్ వద్ద దాదాపు 100 మంది వరకు బందీలు

    2023 అక్టోబర్ 7న హమాస్ బలగాలు ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డాయి. ఆ దాడుల్లో 1,200 మంది ఇజ్రాయెలీలు ప్రాణాలు కోల్పోయారు.

    అంతేకాక, 251 మంది కిడ్నాప్‌ చేయబడ్డారు. వీరిలో కొందరిని విడుదల చేసారుకానీ మరికొందరు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది.

    ప్రస్తుతం హమాస్ వద్ద దాదాపు 100 మంది వరకు బందీలుగా ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇజ్రాయెల్

    తాజా

    WAR 2: 'వార్ 2' టీజర్‌ వచ్చేసింది.. ఎన్టీఆర్ పవర్‌ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా! జూనియర్ ఎన్టీఆర్
    shehbaz sharif: అసత్య ప్రచారంతో ప్రజలను మభ్య పెడుతున్న పాక్ ప్రధాని..భారత్ ఐఎస్ఎస్ విక్రాంత్ ని ధ్వంసం చేశామంటూ గొప్పలు..! పాకిస్థాన్
    Rain Alert: తెలంగాణలో మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు.. 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్! బంగాళాఖాతం
    Covid-19: మళ్లీ భయాందోళన కలిగిస్తున్న కరోనా వేరియంట్.. ఆరోగ్య శాఖ కీలక ప్రకటన.. భారత్‌లో ఎన్ని కేసులున్నాయంటే.. కోవిడ్

    ఇజ్రాయెల్

    Israeli strikes: గాజాలో ఇజ్రాయెల్ దాడులు 19 మంది మృతి, తాజాగా పాలస్తీనాని గుర్తించిన స్లోవేనియా  అంతర్జాతీయం
    Hamas: ఇజ్రాయెల్ బందీలలో ఎంతమంది ప్రాణాలతో బయటపడ్డారో ఎవరికీ తెలియదు: హమాస్ అధికార ప్రతినిధి  హమాస్
    Israel: గాజాలో బక్రీద్ జరుపుకుంటున్న ప్రజలపై IDF విధ్వంసం.. ఇజ్రాయెల్ ప్రధాని సంచలన నిర్ణయం హమాస్
    Project Nimbus: ప్రాజెక్ట్ నింబస్ వివాదం..గూగుల్,అమెజాన్‌లను బహిష్కరించిన 1100 మంది విద్యార్థులు   గూగుల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025