
IMF: యుద్దం వేళ.. పాకిస్తాన్ కు IMF 1 బిలియన్ డాలర్ల రుణం మంజూరు..
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ కింద పాకిస్థాన్కు తక్షణమే 1 బిలియన్ అమెరికన్ డాలర్ల విడుదలకు ఆమోదం తెలిపిందని పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం శుక్రవారం ప్రకటించింది.
ఈ విషయాన్ని ప్రకటించిన ప్రకటనలో, IMF నుండి ఈ మొత్తాన్ని మంజూరు చేసినందుకు ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఆనందం వ్యక్తం చేసినట్లు వెల్లడించారు.
భారత ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయాన్ని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని కూడా ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
వివరాలు
పాక్ ఆర్థిక సహాయం.. ఆందోళనలో భారత్
ఇటీవల పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగవుతుండడంతో, దేశం అభివృద్ధి మార్గంలో ముందుకు సాగుతోందని ప్రకటన స్పష్టం చేసింది.
అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్కు ఇటువంటి భారీ ఆర్థిక సహాయం అందడం భారతదేశానికి ఆందోళన కలిగించే అంశంగా మారింది.
IMF నుంచి వచ్చిన ఈ నిధులను పాకిస్తాన్ ఆయుధాల కొనుగోలు కోసం వినియోగించవచ్చని భారత్ అనుమానం వ్యక్తం చేస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పాకిస్తాన్ కు IMF 1 బిలియన్ డాలర్ల రుణం మంజూరు
STORY | IMF approves USD 1 billion loan for Pakistan: Prime Minister's Office
— Press Trust of India (@PTI_News) May 9, 2025
READ: https://t.co/0pFqcRZ4xp pic.twitter.com/MwMUrfZOeQ