
China tariffs: చైనా-అమెరికా వాణిజ్య యుద్ధం వల్ల భారత ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు లాభాలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, పలు చైనా ఎలక్ట్రానిక్ భాగాల తయారీ సంస్థలు భారత కంపెనీలకు 5 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాయి.
ఈ ఆఫర్లు భారత వినియోగదారులకు టీవీలు, మొబైల్ ఫోన్లు, గృహోపకరణాలు వంటి వస్తువులు మరింత చౌకగా దొరకేలా చేయవచ్చని ఎకనామిక్ టైమ్స్ ఏప్రిల్ 10న వెల్లడించింది.
ఈ నేపథ్యంలోని సమాచారం ప్రకారం, భారత ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలు ఈ ఖర్చు తగ్గింపును వినియోగదారులకు కొంతవరకు బదిలీ చేసి డిమాండ్ పెంచే యోచనలో ఉన్నాయి.
ఇటీవలి కాలంలో అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం మళ్లీ ఉధృతమైంది.
Details
అమెరికా దిగుమతులపై 34శాతం
ఏప్రిల్ 2న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా దిగుమతులపై భారీ టారిఫ్లు విధించగా, చైనా కూడా ప్రతీకారంగా అమెరికా దిగుమతులపై 34% టారిఫ్ విధించింది.
దాంతో అమెరికా తిరిగి టారిఫ్ను 104%కి, అనంతరం ఏప్రిల్ 9న 125%కి పెంచింది. అయితే కొన్ని దేశాలకు ట్రంప్ 90 రోజుల టారిఫ్ విరామం ప్రకటించడంతో గ్లోబల్ మార్కెట్లు పుంజుకున్నాయి.
ఈ పరిణామాల మధ్య చైనా తయారీదారులు స్టాక్తో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.
ఈ నేపథ్యంలో భారత దిగుమతిదారులకు ధరలు తిరిగి చర్చించుకునే అవకాశం ఏర్పడిందని గోడ్రెజ్ ఎంటర్ప్రైజెస్ గ్రూప్ అప్లయెన్స్ విభాగం అధిపతి కమల్ నంది వెల్లడించారు.
Details
కొత్త ఆర్డర్లపై డిస్కౌంట్లు
సూపర్ ప్లాస్ట్రానిక్స్ సీఈఓ అవ్నీత్ సింగ్ మార్వా మాట్లాడుతూ చైనా కంపెనీలు మే-జూన్ లో భారత కంపెనీలు వేస్తున్న కొత్త ఆర్డర్లపై కొన్ని డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి.
వాటిని వినియోగదారులకు కూడా పాక్షికంగా బదిలీ చేయనున్నామని తెలిపారు. ఇదిలా ఉండగా, మార్చి 28న భారత ప్రభుత్వం రూ. 22,919 కోట్ల విలువైన ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకాన్ని ఆమోదించింది.
ఇది దేశీయంగా పాసివ్ ఎలక్ట్రానిక్ భాగాలను తయారు చేయడాన్ని ప్రోత్సహించడంతోపాటు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించేందుకు ఉద్దేశించారు.