NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Sheikh Hasina: మాజీ ప్రధాని షేక్ హసీనా కోసం ఇంటర్‌పోల్ వేట ప్రారంభం!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Sheikh Hasina: మాజీ ప్రధాని షేక్ హసీనా కోసం ఇంటర్‌పోల్ వేట ప్రారంభం!
    మాజీ ప్రధాని షేక్ హసీనా అరెస్ట్‌కు ఇంటర్ పోల్ రంగంలోకి!

    Sheikh Hasina: మాజీ ప్రధాని షేక్ హసీనా కోసం ఇంటర్‌పోల్ వేట ప్రారంభం!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 20, 2025
    12:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఇబ్బందుల్లో చిక్కుకున్నారు.

    దేశాన్ని వదిలి భారత్‌లో ఆశ్రయం పొందినప్పటికీ, బంగ్లా ప్రభుత్వం ఆమెపై దాడులు కొనసాగిస్తోంది.

    తాజాగా బంగ్లాదేశ్‌లో ప్రధాన సలహాదారుగా బాధ్యతలు చేపట్టిన యూనస్‌ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం హసీనా, మాజీ మంత్రులు, అధికారులు కలిపి 12 మందిపై అరెస్ట్ వారెంట్‌లను జారీ చేసింది.

    గతేడాది ఆగస్టు నుంచి హసీనా భారత్‌లోనే ఉంటున్నారు. భారత ప్రభుత్వ మద్దతుతో ఆమె ఇక్కడ తలదాచుకుంటున్నా, తాజాగా ఆమెను తిరిగి బంగ్లాదేశ్‌కు రప్పించేందుకు చర్యలు వేగవంతమయ్యాయి.

    Details

    12మందిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలి

    ఈ నేపథ్యంలో ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించిన బంగ్లా పోలీసులు.. హసీనా సహా మిగిలిన 12 మందిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని కోరారు.

    ఒకవేళ రెడ్ నోటీసులు జారీ అయితే, వారు ఏ దేశంలో ఉన్నా అరెస్టు చేయడం సాధ్యమవుతుంది.

    ఇక ఇటీవలే హసీనా కుటుంబాన్ని ఉద్దేశించిన మరిన్ని చర్యలతో బంగ్లా ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది.

    ఆమె కుమారుడు సజీబ్ వాజిద్‌కి ఢాకా శివార్లలో ఇళ్ల స్థలాల కేటాయింపులో జరిగిన అవకతవకల కేసులో అరెస్ట్ వారెంట్ జారీ అయింది.

    Details

    ఏప్రిల్ 29లోగా నివేదిక ఇవ్వాలి

    మొత్తం 16 మందిపై ఢాకా మెట్రోపాలిటన్‌ సీనియర్‌ ప్రత్యేక జడ్జి వారెంట్‌లను జారీ చేయగా, నిందితులంతా పరారీలో ఉన్నారని, ఏప్రిల్ 29లోగా దీనిపై నివేదిక ఇవ్వాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.

    ఈ కేసుకు సంబంధించి, ఢాకా శివార్లలో ఉన్న పూర్వాచల్‌ న్యూటౌన్‌లో దౌత్యవేత్తల కోసం కేటాయించిన 1.86 ఎకరాల స్థలాన్ని హసీనా, ఆమె బంధువులు స్వాధీనం చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి.

    దీనిపై గత డిసెంబర్‌లోనే బంగ్లాదేశ్ అవినీతి నిరోధక కమిషన్‌ (ACC) దర్యాప్తును ప్రారంభించింది. అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలతో ఆమెపై తీవ్ర ఒత్తిడి నెలకొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    షేక్ హసీనా
    బంగ్లాదేశ్

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    షేక్ హసీనా

    Bangladesh: షేక్ హసీనా లండన్‌లో రాజకీయ ఆశ్రయం ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు? అంతర్జాతీయం
    Hero Killed: అల్లరిమూకల విధ్వంసం.. హీరో, నిర్మాతను కొట్టి చంపిన ఆందోళన కారులు బంగ్లాదేశ్
    Muhammad Yunus : బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్ గ్రహిత మహ్మద్ యూనస్ నాయతక్వం బంగ్లాదేశ్
    Sheikh Hasina: షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చేందుకు బ్రిటన్ నిరాకరణ.. ఇక భారత్‌లోనే భారతదేశం

    బంగ్లాదేశ్

    Delhi: బంగ్లాదేశ్‌ పిల్లల గుర్తింపుపై MCD సర్క్యులర్‌.. దిల్లీ పాఠశాలలకు కీలక ఆదేశాలు  దిల్లీ
    U19: అండర్-19 మహిళల ఆసియా టీ20 ఛాంపియన్‌గా భారత్ భారత జట్టు
    Bangladesh: భారత్‌కు బంగ్లా లేఖ.. మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించండి అంతర్జాతీయం
    Terrorist Activities: భారత్‌లో ఉగ్రవాదానికి మద్దతు.. బంగ్లాదేశ్ జాతీయుడికి ఏడేళ్ల జైలు శిక్ష భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025