NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / హిజాబ్ ఆందోళనల్లో పాల్గొన్న మరో ముగ్గురికి ఉరి
    అంతర్జాతీయం

    హిజాబ్ ఆందోళనల్లో పాల్గొన్న మరో ముగ్గురికి ఉరి

    హిజాబ్ ఆందోళనల్లో పాల్గొన్న మరో ముగ్గురికి ఉరి
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 10, 2023, 10:04 am 0 నిమి చదవండి
    హిజాబ్ ఆందోళనల్లో పాల్గొన్న మరో ముగ్గురికి ఉరి
    మరో ముగ్గురికి ఉరిశిక్ష అమలు చేసిన ఇరాన్

    హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొన్న మరో ముగ్గురికి ఇరాన్ కోర్టు మరణ శిక్ష విధించింది. హిజాబ్ ఆందోళనల్లో పాల్గొంటున్న నిరసనకారులపై ఇరాన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇరాన్ అణిచివేతపై అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇరాన్‌లో కొన్ని రోజుల క్రితం హిజాబ్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈఘటనలో ఒక పారామిలటరీ సిబ్బంది మృతి చెందాడు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఇరాన్ ప్రభుత్వం.. భద్రతా సిబ్బంది మృతికి కారణమైన వారిని అరెస్టు చేసింది. అందులో ఇద్దరిని శనివారం ఉరితీసింది. ఇప్పుడు మరో ముగ్గురికి ఇరాన్ కోర్టు మరణశిక్షను విధించింది. గతేడాది సెప్టెంబర్‌లో 22 ఏళ్ల మహ్సా అమిని పోలీసుల కస్టడీలో మృతి చెందిన తర్వాత.. దేశంలో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటాయి.

    వ్యతిరేకిస్తున్న పాశ్చాత్య దేశాలు

    ఇరాన్ న్యూస్ ఏజెన్సీ మిజాన్ ప్రకారం.. పారామిలటరీ సిబ్బంది మృతి కేసులో ప్రస్తుతం సలేహ్ మిర్హాషెమి, మాజిద్ కజెమీ, సయీద్ యాగౌబికు కోర్టు మరణశిక్ష విధించింది. అయితే తీర్పును వ్యతిరేకంగా అప్పీల్ చేసుకునేందుకు బాధితులకు మరో అవకాశం కల్పించింది. ఇదిలా ఉంటే.. నిరసనకారులకు మరణశిక్ష విధించడాన్ని యూరోపియన్ యూనియన్, అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇరాన్‌లో వరుస మరణ శిక్షలపై పోప్ ఫ్రాన్సిస్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇరాన్‌లో జీవించే హక్కు ప్రమాదంలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ అణచివేత తీవ్రస్థాయిలో ఉన్నా.. టెహ్రాన్, ఇస్ఫహాన్‌తో పాటు అనేక నగరాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. నిరసనలు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరాన్ ప్రభుత్వం నలుగురిని ఉరి తీసింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    ప్రపంచం
    ఇరాన్

    తాజా

    నిఖత్ జరీన్ గోల్డన్ పంచ్.. రెండోసారి టైటిల్ కైవసం బాక్సింగ్
    దేశంలో విజృంభిస్తున్న కరోనా; 1,890 కొత్త కేసులు ; 149 రోజుల్లో ఇదే అత్యధికం కోవిడ్
    రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సత్యాగ్రహాలు కాంగ్రెస్
    శ్రీహరికోట: భారతదేశపు అతిపెద్ద ఎల్‌వీఎం రాకెట్‌ను ప్రయోగించిన ఇస్రో ఇస్రో

    ప్రపంచం

    గ్లోబల్ మార్కెట్లో విడుదల కానున్న ASUS ROG ఫోన్ 7, 7 అల్టిమేట్ స్మార్ట్ ఫోన్
    ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో నిఖత్ జరీన్.. టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో బాక్సింగ్
    మరో అరుదైన ఫీట్ సాధించిన లియోనెల్ మెస్సీ ఫుట్ బాల్
    భారత స్టార్‌ షట్లర్లు కిదాంబి శ్రీకాంత్‌, హెచ్‌.ఎస్‌ ప్రణయ్‌ అవుట్ టెన్నిస్

    ఇరాన్

    50పైగా పాఠాశాలల్లో బాలికలపై విష ప్రయోగం విద్యార్థులు
    రాఖీ సావంత్ భర్తపై మరో కేసు- ఇరాన్ విద్యార్థినిపై అత్యాచార ఆరోపణలు కర్ణాటక

    అంతర్జాతీయం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    World Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023