NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / హిజాబ్ ఆందోళనల్లో పాల్గొన్న మరో ముగ్గురికి ఉరి
    తదుపరి వార్తా కథనం
    హిజాబ్ ఆందోళనల్లో పాల్గొన్న మరో ముగ్గురికి ఉరి
    మరో ముగ్గురికి ఉరిశిక్ష అమలు చేసిన ఇరాన్

    హిజాబ్ ఆందోళనల్లో పాల్గొన్న మరో ముగ్గురికి ఉరి

    వ్రాసిన వారు Stalin
    Jan 10, 2023
    10:04 am

    ఈ వార్తాకథనం ఏంటి

    హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొన్న మరో ముగ్గురికి ఇరాన్ కోర్టు మరణ శిక్ష విధించింది. హిజాబ్ ఆందోళనల్లో పాల్గొంటున్న నిరసనకారులపై ఇరాన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇరాన్ అణిచివేతపై అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    ఇరాన్‌లో కొన్ని రోజుల క్రితం హిజాబ్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈఘటనలో ఒక పారామిలటరీ సిబ్బంది మృతి చెందాడు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఇరాన్ ప్రభుత్వం.. భద్రతా సిబ్బంది మృతికి కారణమైన వారిని అరెస్టు చేసింది. అందులో ఇద్దరిని శనివారం ఉరితీసింది. ఇప్పుడు మరో ముగ్గురికి ఇరాన్ కోర్టు మరణశిక్షను విధించింది.

    గతేడాది సెప్టెంబర్‌లో 22 ఏళ్ల మహ్సా అమిని పోలీసుల కస్టడీలో మృతి చెందిన తర్వాత.. దేశంలో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటాయి.

    ఇరాన్

    వ్యతిరేకిస్తున్న పాశ్చాత్య దేశాలు

    ఇరాన్ న్యూస్ ఏజెన్సీ మిజాన్ ప్రకారం.. పారామిలటరీ సిబ్బంది మృతి కేసులో ప్రస్తుతం సలేహ్ మిర్హాషెమి, మాజిద్ కజెమీ, సయీద్ యాగౌబికు కోర్టు మరణశిక్ష విధించింది. అయితే తీర్పును వ్యతిరేకంగా అప్పీల్ చేసుకునేందుకు బాధితులకు మరో అవకాశం కల్పించింది.

    ఇదిలా ఉంటే.. నిరసనకారులకు మరణశిక్ష విధించడాన్ని యూరోపియన్ యూనియన్, అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

    ఇరాన్‌లో వరుస మరణ శిక్షలపై పోప్ ఫ్రాన్సిస్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇరాన్‌లో జీవించే హక్కు ప్రమాదంలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

    ప్రభుత్వ అణచివేత తీవ్రస్థాయిలో ఉన్నా.. టెహ్రాన్, ఇస్ఫహాన్‌తో పాటు అనేక నగరాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. నిరసనలు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరాన్ ప్రభుత్వం నలుగురిని ఉరి తీసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రపంచం

    తాజా

    RCB vs PBKS : ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Virat Kohli: ఐపీఎల్ హిస్టరీలో విరాట్ కోహ్లీ అద్భుత రికార్డు విరాట్ కోహ్లీ
    Shreyas Iyer: ఐపీఎల్‌ ఫైనల్స్‌ స్పెషలిస్ట్‌ అయ్యర్‌? పంజాబ్‌ ట్రోఫీ కల సాకారమవుతుందా?  శ్రేయస్ అయ్యర్
    Tata Harrier ev: ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ హారియర్‌ ఈవీని లాంచ్‌ చేసిన టాటా.. ఒక్కసారి ఛార్జి చేస్తే 627 కిలోమీటర్ల ప్రయాణం  టాటా హారియర్

    ప్రపంచం

    గత పదేళ్లలో ఐదు అద్భుత టెస్టు సిరీస్‌లు క్రికెట్
    కోనేరు హంపి ఆట ఆదుర్స్ క్రికెట్
    సిక్స్ ప్యాక్ లుక్‌లో అర్జున్ టెండూల్కర్ అదరహో.. క్రికెట్
    టీ20 సిరీస్‌లో.. ముగ్గురు నయా ప్లేయర్లు క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025