LOADING...
Khamenei Funeral: ఇరాక్‌లో ఖమేనీ అంతిమయాత్ర.. వేలాదిగా తరలివచ్చిన భక్తులు, అభిమానులు
ఇరాక్‌లో ఖమేనీ అంతిమయాత్ర.. వేలాదిగా తరలివచ్చిన భక్తులు, అభిమానులు

Khamenei Funeral: ఇరాక్‌లో ఖమేనీ అంతిమయాత్ర.. వేలాదిగా తరలివచ్చిన భక్తులు, అభిమానులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 08, 2026
04:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్ దివంగత సర్వోన్నత నేత అయతొల్లా అలీ ఖమేనీ అంతిమయాత్ర బుధవారం ఇరాక్‌కు చేరుకుంది. షియా ముస్లింలకు అత్యంత పవిత్రమైన నజాఫ్, కర్బలా నగరాల్లో ఖమేనీకి తుది వీడ్కోలు పలికేందుకు వేలాది మంది ప్రజలు భారీగా తరలివచ్చారు. ఆయనకు నివాళులర్పించేందుకు స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు,అనుచరులు హాజరయ్యారు. గత ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన సైనిక దాడుల్లో ఖమేనీ మరణించారు. ఆయన మరణం అనంతరం ఇరాన్ ప్రభుత్వం ఆరు రోజుల జాతీయ సంతాపాన్ని ప్రకటించింది. శనివారం ప్రారంభమైన ఈ సంతాప కార్యక్రమాల్లో భాగంగా, ఇరాన్-ఇరాక్ దేశాల మధ్య ఉన్న ఆధ్యాత్మిక, రాజకీయ బంధానికి ప్రతీకగా ఒక రోజు పాటు అంతిమయాత్రను ఇరాక్‌లో నిర్వహించారు.

వివరాలు 

ఆరు కిలోమీటర్ల మేర అంతిమయాత్ర

ఖమేనీ భౌతికకాయాన్ని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో పాటు ఇరాక్‌కు చెందిన ఉన్నతాధికారులు నజాఫ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారిక లాంఛనాలతో స్వీకరించారు. ఈ సందర్భంగా ఇరాక్ ప్రభుత్వం బుధవారం ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. నజాఫ్‌లోని పవిత్ర ఇమామ్ అలీ దర్గా వరకు దాదాపు ఆరు కిలోమీటర్ల మేర అంతిమయాత్ర కొనసాగింది. అనంతరం ఖమేనీ భౌతికకాయాన్ని కర్బలాలోని ఇమామ్ హుస్సేన్ దర్గాకు తరలించారు. ఈ సందర్భంగా అమెరికా,ఇజ్రాయెల్‌లకు వ్యతిరేకంగా పోరాడిన నాయకుడిగా ఖమేనీని కొనియాడుతూ ప్రజలు ఘనంగా నివాళులర్పించారు.

వివరాలు 

ముగిసిన ఆరు రోజుల జాతీయ సంతాప కార్యక్రమాలు

ఇరాక్‌లోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఖమేనీ స్వస్థలమైన ఇరాన్‌లోని మషద్ నగరంలో గురువారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీంతో ఆరు రోజుల జాతీయ సంతాప కార్యక్రమాలు ముగియనున్నాయి.

Advertisement