Maldives: దయచేసి మా దేశం రండి.. మాల్దీవుల పర్యాటక మంత్రి భారత్ కు విజ్ఞప్తి
తమ దేశ ఆర్థిక వ్యవస్థకు సహకరించాలని మాల్దీవుల పర్యాటక మంత్రి భారత్ కు విజ్ఞప్తి చేశారు. పీటీఐ వీడియోస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇబ్రహీం పైసల్ ఈ వ్యాఖ్యలు చేశారు. మా దేశం తరఫున భారతీయులకు స్వాగతం.దయచేసి మాల్దీవుల టూరిజంలో భాగం కండి అన్నారు. ద్వైపాక్షిక సంబంధాల క్షీణత మధ్య మాల్దీవులను సందర్శించే భారత పర్యాటకుల సంఖ్య తగ్గింది. ఆ మధ్య భారత్ సహ ప్రధాని నరేంద్ర మోదీ పై మాల్దీవుల మంత్రులు నోరుపారేసుకున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య విబేధాలు తలెత్తాయి.మాల్దీవుల ఆర్థిక వ్యవస్థపై అది ఇప్పుడు పెను ప్రభావం చూపుతోంది. అందుకే మాల్దీవుల్లో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం భారత్ తో కలిసి పని చేయాలి అనుకుంటోంది. భారతీయులకు స్వాగతం పలుకుతోంది.