LOADING...
Iran President: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై మోదీ-పెజెష్కియాన్ చర్చ
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై మోదీ-పెజెష్కియాన్ చర్చ

Iran President: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై మోదీ-పెజెష్కియాన్ చర్చ

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 21, 2026
05:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపధ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ఫోన్‌లో సంభాషించారు. ఈ సంభాషణలో రంజాన్‌, నౌరుజ్‌ (పర్షియన్‌ నూతన సంవత్సరం) శుభాకాంక్షలు తెలియజేసిన మోదీ, ఈ పర్వదినాలు పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వాన్ని పెంచుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు, అంతర్జాతీయ సరఫరా గొలుసుకు ఆటంకం కలిగించే కీలక మౌలిక సదుపాయాలపై దాడులను ఖండించారు. నౌకాయానం సురక్షితంగా కొనసాగాల్సిన అవసరం, నౌకామార్గాలను తెరిచి ఉంచడం, వాటిని రక్షించడం ఎంత ముఖ్యమో ఆయన గుర్తు చేశారు.

Details

ఇరాన్‌ అధ్యక్షుడితో రెండోసారి ఫోన్‌ మాట్లాడిన మోదీ

అలాగే ఇరాన్‌లోని భారతీయుల రక్షణకు ఆ దేశం తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోదీ ప్రశంసించారు. ఇది యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్‌ అధ్యక్షుడితో మోదీ రెండోసారి ఫోన్‌లో సంభాషించడం. మార్చి 12న జరిగిన మొదటి సంభాషణలో ప్రధాని మోదీ, ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసి, సమస్యలను చర్చలు, దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించాలని సూచించారు. తదుపరి, మోదీ సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్‌, ఖతార్‌, కువైట్‌, జోర్డాన్‌, మలేసియా, ఫ్రాన్స్‌ నాయకులతో ఫోన్‌లో మాట్లాడుతూ పశ్చిమాసియాలో తాజా పరిస్థితులపై చర్చలు జరిపారు. కఠిన పరిస్థితులను సమగ్రంగా అర్థం చేసుకున్నారు.

Advertisement