Netanyahu: భారత్ వంటి మిత్రదేశాలు మాకు ఉన్నాయి.. జేడీ వాన్స్కు నెతన్యాహు కౌంటర్
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్కు అమెరికా మాత్రమే ఏకైక మిత్రదేశమన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యలకు ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. అమెరికా తమకు అత్యంత కీలకమైన మిత్రదేశమే అయినప్పటికీ, భారత్ వంటి విశ్వసనీయ సన్నిహిత దేశాలు కూడా ఇజ్రాయెల్కు అండగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జేడీ వాన్స్ మాట్లాడుతూ, ఇజ్రాయెల్కు నిజమైన శక్తిమంతమైన మిత్రదేశం అమెరికానేనని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన నెతన్యాహు, అమెరికా అందిస్తున్న మద్దతు తమకు అమూల్యమని పేర్కొంటూనే, ఇతర దేశాల నుంచి కూడా బలమైన సహకారం లభిస్తోందని తెలిపారు.
వివరాలు
నమ్మకమైన మిత్రదేశాల్లో భారత్ ఒకటి
ప్రత్యేకంగా భారత్ను ప్రస్తావించిన ఆయన, 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఇజ్రాయెల్కు విశేషమైన ఆదరణ, మద్దతు లభిస్తోందని చెప్పారు. భారత్ తమకు నమ్మకమైన మిత్రదేశాల్లో ఒకటని పేర్కొన్నారు. అలాగే ప్రపంచంలోని పలువురు దేశాధినేతలు బహిరంగంగా కాకపోయినా, వ్యక్తిగతంగా ఇజ్రాయెల్కు తమ మద్దతు వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను వైట్హౌస్లో ఇజ్రాయెల్కు అత్యంత సన్నిహిత మిత్రుడిగా నెతన్యాహు అభివర్ణించారు. జేడీ వాన్స్పై తనకు పూర్తి గౌరవం ఉందని, అయితే ఆయన చెప్పిన ప్రతి విషయంతో తాను తప్పనిసరిగా ఏకీభవించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.