Page Loader
Nepal-Hundred Rupees Note-New places: మూడు కొత్త భూభాగాలతో వంద నోటును ముద్రించనున్న నేపాల్​....అభ్యంతరం తెలిపిన భారత్
నేపాల్​ రూ.100 నోటు

Nepal-Hundred Rupees Note-New places: మూడు కొత్త భూభాగాలతో వంద నోటును ముద్రించనున్న నేపాల్​....అభ్యంతరం తెలిపిన భారత్

వ్రాసిన వారు Stalin
May 04, 2024
12:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేపాల్​ దేశం విశ్వాస ఘాతుకానికి పాల్పడుతోంది. తాజాగా మూడు కొత్త భూభాగాలతో కూడిన వంద రూపాయల నోటును ఆ దేశం పునర్ముద్రించనున్నట్లు ప్రకటించింది. వివాదాస్పద భూభాగాలైన లిపులేఖ్​, లింపియాధురా, కాలాపానీలతో కొత్త పటాన్ని ఏర్పాటు చేసింది. నేపాల్​ ప్రధాని పుష్పకుమార్​ దహల్​ నేతృత్వంలో సమావేశమైన మంత్రిమండలి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ సమాచార ప్రసార శాఖ మంత్రి రేఖా శర్మ మీడియాకు తెలిపారు. నేపాల్​ పునర్ముద్రించనున్న కొత్త వంద రూపాయల నోటుపై ఉన్న భూభాగాలు భారత్​ కు చెందినవి. నేపాల్​ చర్య పట్ల ఇండియా అభ్యంతరం వ్యక్తం చేస్తూ దీనిని కృత్రిమ విస్తరణగా అభివర్ణించింది. సిక్కిం, పశ్చిమబెంగాల్​, బీహార్​, ఉత్తరాఖండ్​, ఉత్తర్​ ప్రదేశ్​లతో నేపాల్​తో 1850 కి.మీ.సరిహద్దును పంచుకుంటోంది.