NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Nobel Prize: అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌
    తదుపరి వార్తా కథనం
    Nobel Prize: అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌
    Nobel Prize: అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌

    Nobel Prize: అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 14, 2024
    03:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అర్థశాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్‌ బహుమతిని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ప్రకటించింది.

    2024 సంవత్సరానికి గాను ముగ్గురికి ఈ పురస్కారం అందించనుంది. దేశాల మధ్య సంపదలో అసమానతలపై పరిశోధనలు చేసిన డారెన్‌ ఏస్‌మోగ్లు, సైమన్‌ జాన్సన్, జేమ్స్‌ ఎ. రాబిన్‌సన్‌ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.

    వైద్యవిభాగంతో ప్రారంభమైన నోబెల్‌ పురస్కారాల ప్రకటన ఈ రోజుతో ముగిసింది.

    గత సోమవారం వైద్యశాస్త్రంలో విజేతలను ప్రకటించిన తర్వాత, వరుసగా భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, సాహిత్యం విభాగాల్లో కూడా పురస్కారాలను ప్రకటించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    నోబెల్ టీం చేసిన ట్వీట్ 

    BREAKING NEWS
    The Royal Swedish Academy of Sciences has decided to award the 2024 Sveriges Riksbank Prize in Economic Sciences in Memory of Alfred Nobel to Daron Acemoglu, Simon Johnson and James A. Robinson “for studies of how institutions are formed and affect prosperity.”… pic.twitter.com/tuwIIgk393

    — The Nobel Prize (@NobelPrize) October 14, 2024

    వివరాలు 

    ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులు ప్రదానం 

    శుక్రవారం రోజున నోబెల్‌ శాంతి బహుమతి (Nobel Peace Prize 2024)పై ప్రకటన చేయగా, తాజగా అర్థశాస్త్రంలో ముగ్గురు ఆర్థికవేత్తల పేర్లను ప్రకటించారు.

    డారెన్‌, సిమోన్‌ అమెరికాలోని కేంబ్రిడ్జ్‌లో ఉన్న మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందినవారు, షికాగో యూనివర్సిటీలో జేమ్స్‌ రాబిన్‌సన్ పరిశోధనలు చేస్తున్నారు.

    స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త,ఇంజినీర్‌,వ్యాపారవేత్త ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరు మీదుగా, ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు.

    1896లో ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ మరణించడంతో, 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తున్నారు.

    అవార్డు గ్రహీతలకు 11 మిలియన్ల స్వీడిష్‌ క్రోనర్‌ నగదు అందిస్తుంది. డిసెంబర్‌ 10న నిర్వహించే కార్యక్రమంలో గ్రహీతలకు అవార్డులను అందజేయనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నోబెల్ బహుమతి

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    నోబెల్ బహుమతి

    Nobel Prize 2023: అర్థశాస్త్రంలో క్లాడియా గోల్డిన్‌కు నోబెల్ బహుమతి  స్వీడన్
    Elon Musk: నోబెల్ శాంతి బహుమతికి మస్క్ నామినేట్ ఎలాన్ మస్క్
    Nobel Prize 2024: వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసిన విక్టర్‌ ఆంబ్రోస్‌,గ్యారీ రవ్‌కున్‌కు నోబెల్‌   టెక్నాలజీ
    Nobel Prize: నోబెల్ బహుమతి.. మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలివే!  ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025