NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Kim Jong Un: ఉత్తర కొరియాలో 30 మంది ప్రభుత్వ అధికారులకు మరణశిక్ష..!
    తదుపరి వార్తా కథనం
    Kim Jong Un: ఉత్తర కొరియాలో 30 మంది ప్రభుత్వ అధికారులకు మరణశిక్ష..!
    ఉత్తర కొరియాలో 30 మంది ప్రభుత్వ అధికారులకు మరణశిక్ష..!

    Kim Jong Un: ఉత్తర కొరియాలో 30 మంది ప్రభుత్వ అధికారులకు మరణశిక్ష..!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 04, 2024
    11:28 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ నియంతృత్వ పాలన ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

    అక్కడ ప్రజలు కఠినమైన ఆంక్షలు, చిన్న తప్పిదాలకు కూడా తీవ్ర శిక్షలు అనుభవిస్తున్నారు.

    ఇటీవల, భారీ వర్షాలు,వరదల కారణంగా ఉత్తరకొరియా తీవ్ర పరిస్థితే ఎదుర్కొంది. ఈ సందర్భంలో, విపత్తు నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు పై కిమ్ జోంగ్ ఉన్ కఠిన చర్యలకు ఆదేశించినట్లు సమాచారం.

    దాదాపు 30 మంది ప్రభుత్వ అధికారులపై మరణశిక్ష అమలు చేయాలని ఆయన ఆదేశించారని అంతర్జాతీయ మీడియా కథనాలు తెలిపాయి.

    వివరాలు 

    విధుల నుంచి కాంగ్ బాంగ్ హూన్ తొలగింపు 

    దక్షిణ కొరియా మీడియా ఒక కథనంలో, అవినీతి, విధుల్లో నిర్లక్ష్యానికి గురైన 20-30 మంది అధికారులకు గత నెలలో మరణశిక్ష విధించారన్న విషయాన్ని ముందుగా వెల్లడించింది.

    ఆ తర్వాత, ఈ శిక్షను అమలు చేసినట్లు కూడా చెప్పింది. అయితే, అధికారికంగా ఈ శిక్ష అమలుపై ఎలాంటి స్పష్టత లేదు. శిక్షకు గురైన అధికారుల వివరాలు బయటకు రాలేదు.

    చాగాంగ్ ప్రావిన్స్ ప్రొవిన్షియల్ పార్టీ కమిటీ సెక్రటరీ కాంగ్ బాంగ్ హూన్ కూడా శిక్షకు గురైన వారిలో ఉన్నారని సమాచారం.

    విపత్తు సమయంలో, కిమ్ జోంగ్ ఉన్ ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, హూన్‌ను విధుల నుంచి తొలగించారు.

    వివరాలు 

     విపత్తు ప్రదేశాలలో పర్యటించిన కిమ్ జోంగ్ ఉన్

    జులై-ఆగస్టు మధ్య ఉత్తరకొరియాలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో, వరదలు, బురదచరియలు అనేక ఊర్లను తుడిచివేసాయి.

    ఈ విపత్తులో దాదాపు 4,000 మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

    వరదల సమయంలో, కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా విపత్తు ప్రదేశాలను పర్యటించారు.

    మోకాలిలోతు నీటిలో కారు నడపడం, బోటులో సహాయక చర్యలను పర్యవేక్షించడం వంటి దృశ్యాలు వైరల్ అయ్యాయి.

    ఇదిలా ఉండగా.. కిమ్‌ రాజ్యంలో ఇలాంటి శిక్షలు సాధారణమైనవి. 2019లో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కిమ్ జోంగ్ ఉన్ చర్చలు సరిగా నిర్వహించకపోవడంతో, ఉత్తరకొరియా అణు రాయబారి కిమ్ హోక్ చోల్‌ను మరణశిక్షకు గురిచేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కిమ్ జోంగ్ ఉన్‌

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    కిమ్ జోంగ్ ఉన్‌

    పుతిన్ కోసం రష్యా వెళ్లిన కిమ్.. అమెరికా హెచ్చరికల్ని పట్టించుకోని ఉత్తరకొరియా ఉత్తర కొరియా/ డీపీఆర్‌కే
    రష్యా గడ్డపై అడుగుపెట్టిన కిమ్‌ జోంగ్ ఉన్.. ఆ రైలు మాత్రం చాలా ప్రత్యేకం గురూ అంతర్జాతీయం
    అణ్వాయుధ సంపత్తి పెంపుదల కోసం రాజ్యాంగాన్ని సవరించిన ఉత్తరకొరియా.. ప్రపంచ దేశాల ఆందోళన  ఉత్తర కొరియా/ డీపీఆర్‌కే
    Kim Jong: ఉత్తర కొరియా మహిళల ఎదుట ఏడ్చేసిన కిమ్.. కారణం ఇదే..  కిమ్ జంగ్ ఉన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025