NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Pakistan:'మా ప్రధాని పిరికివాడు'.. పార్లమెంటులో పాక్‌ ఎంపీ ఫైర్‌
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Pakistan:'మా ప్రధాని పిరికివాడు'.. పార్లమెంటులో పాక్‌ ఎంపీ ఫైర్‌
    'మా ప్రధాని పిరికివాడు'.. పార్లమెంటులో పాక్‌ ఎంపీ ఫైర్‌

    Pakistan:'మా ప్రధాని పిరికివాడు'.. పార్లమెంటులో పాక్‌ ఎంపీ ఫైర్‌

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 09, 2025
    05:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌' నేపథ్యంలో పాకిస్థాన్‌లో కలకలం రేగింది.

    ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో పాకిస్థాన్‌ తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది.

    భారత్‌పై విఫల దాడుల యత్నాలకు పాల్పడుతోంది. అయితే భారత బలగాలు పాక్‌ దాడులను సమర్థంగా తిప్పికొట్టడంతో పాటు, ఆ దేశ గగనతల రక్షణ వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేశాయి.

    ఈ పరిణామాలతో పాక్‌ లోపల ఆగ్రహావేశాలు చెలరేగుతున్నాయి. ప్రజలు, రాజకీయ నాయకులు తమ ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శిస్తున్నారు.

    తాజాగా తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ ఎంపీ షాహిద్ అహ్మద్ పార్లమెంట్‌లో ఉద్ధృత వ్యాఖ్యలు చేశారు.

    Details

    నరేంద్ర మోదీ పేరే పలకలేని స్థితిలో ఉన్నాడు

    ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను 'పిరికివాడి'గా అభివర్ణించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరే పలకలేని స్థితిలో ఉన్నారని ఆరోపించారు.

    టిప్పు సుల్తాన్‌ మాటలు ఉటంకిస్తూ.. సింహాల సైన్యాన్ని నక్క నడిపితే, అవి ఓడిపోవడం ఖాయమని పేర్కొన్నారు.

    తమ సైనికులు ధైర్యంగా పోరాడాలనుకున్నా, ప్రధానికే ధైర్యం లేకపోతే వారు ముందుకు ఎలా వెళ్లగలరని ప్రశ్నించారు.

    భారత్‌ దాడులు చేసినప్పటి నుంచి ప్రధాని ఒక్క ప్రకటన కూడా చేయలేదని తీవ్రంగా దుయ్యబట్టారు.

    ఈ పరిస్థితుల్లో సరిహద్దుల్లో ఉన్న సైనికులకు ప్రభుత్వం ఏం ఆదేశాలు ఇస్తుందనే ప్రశ్నను లేవనెత్తారు.

    Details

    పాక్ దాడులను తిప్పికొట్టిన భారత్

    ఇంతలో, భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు పాకిస్థాన్‌ గురువారం రాత్రి దాడులకు యత్నించింది.

    జమ్ముకశ్మీర్‌, రాజస్థాన్‌, పంజాబ్‌, హర్యానా సరిహద్దు ప్రాంతాల్లో పలు డ్రోన్లను పంపించింది.

    అయితే భారత బలగాలు ముందస్తుగా అప్రమత్తమై వాటిని సమర్థంగా తిప్పికొట్టాయి.

    ఉధంపుర్‌, సాంబా, జమ్ము, అఖ్నూర్‌, నగ్రోటా, పఠాన్‌కోట్‌ ప్రాంతాల్లో పాక్‌ ప్రయోగించిన 50 డ్రోన్లను భారత సైన్యం కూల్చివేసింది.

    ఇది భారత్‌ సైనిక శక్తి, గగనతల రక్షణ సామర్థ్యానికి నిదర్శనంగా నిలిచింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్
    ఆపరేషన్‌ సిందూర్‌

    తాజా

    Pakistan:'మా ప్రధాని పిరికివాడు'.. పార్లమెంటులో పాక్‌ ఎంపీ ఫైర్‌ పాకిస్థాన్
    New flight services: ఏపీ నుంచి మూడు కొత్త విమాన మార్గాలు.. అబుదాబి, బెంగళూరు, భువనేశ్వర్‌కు డైరెక్ట్‌ సర్వీసులు! కింజరాపు రామ్మోహన్ నాయుడు
    India-Pak: ఉద్రిక్తతల వేళ .. నిత్యావసర నిల్వలపై కేంద్రం కీలక ప్రకటన! కేంద్ర ప్రభుత్వం
    Chiru-Anil: చిరు-అనిల్‌ రావిపూడి మూవీ.. షూటింగ్‌కు ముహూర్తం ఖరారు! చిరంజీవి

    పాకిస్థాన్

    Indian Navy: ఎప్పుడైనా, ఎక్కడైనా సిద్ధమే.. త్రిశూల శక్తి చూపించిన నేవీ భారతదేశం
    Pakistan: పహల్గాం దాడి అనంతరం పాక్‌ క్షిపణి ప్రయోగం ప్రపంచం
    India-Pakistan: పాకిస్థాన్‌కు భారత్ షాక్‌.. అన్ని మెయిల్స్‌, పార్సిళ్ల నిలిపివేత కేంద్ర ప్రభుత్వం
    Pakistan: సింధూ నదిపై నిర్మాణం చేపడితే ధ్వంసం చేస్తాం : పాక్ రక్షణ మంత్రి హెచ్చరిక ప్రపంచం

    ఆపరేషన్‌ సిందూర్‌

    Operation Sindoor: ఆత్మాహుతి డ్రోన్లు, స్కాల్ప్ క్షిపణులతో విరుచుకుపడ్డ భారత్ భారతదేశం
    Operation Sindoor: పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై 'ఆపరేషర్‌ సిందూర్‌'.. దేశవ్యాప్తంగా అప్రమత్తమైన భద్రతా బలగాలు, పోలీసులు  భారతదేశం
    Vyomika Singh and Sophia Qureshi:ఆపరేషన్ సింధూర్..ఎవరి..సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్ ? భారతదేశం
    Operation Sindoor: పాక్‌లో ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడి.. మాజీ, ప్రస్తుత క్రికెటర్ల స్పందనలివే!  క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025