
Pak Army Chief: అమెరికాలో పాక్ ఆర్మీ చీఫ్కు తీవ్ర అవమానం
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ అమెరికా పర్యటనలో తీవ్ర అవమానాన్ని ఎదుర్కొన్నారు.
ఆయన వాషింగ్టన్లోని ఫోర్ సీజన్స్ హోటల్లో బస చేస్తుండగా, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ పార్టీకి చెందిన వలసపోయిన పాక్ పౌరులు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు.
ఈ నిరసనకారులు హోటల్ వెలుపల గట్టిగా నినాదాలు చేయడంతోపాటు అసిం మునీర్ను తీవ్ర పదజాలంతో దూషించారు.
డిక్టేటర్, మాస్ మర్డరర్, బాస్టర్డ్ వంటి పదాలు వినిపించాయి. నిరసనకారులు ఒక డిజిటల్ బోర్డ్ను చూపిస్తూ.. 'ఇదిగో, ఇదే ఆయన పాకిస్థాన్తో చేసిన పని అని పేర్కొన్నారు.
Details
వెనక్కి తగ్గిన నిరసనకారులు
ఆ బోర్డ్పై Mass Murderer, Democracy Dies When Guns Speak, Asim Munir, Your Time Is Up - Pakistan Will Rise వంటి డిజిటల్ ప్రకటనలు ప్రదర్శించారు.
ఒక నిరసనకారి మరింతగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ.. "అసిం మునీర్, నువ్వు ఎక్కడ దాక్కున్నావో తెలుసు. నీవు రెండో బేస్మెంట్లో దాక్కున్నావ్. ప్రజలు నిన్ను వెతుకున్నారంటూ బహిరంగంగా బెదిరించారు.
ఈ సమయంలో హోటల్ సిబ్బంది రంగంలోకి దిగి, ఇది ప్రైవేట్ ప్రాపర్టీ అని చెబుతూ నిరసనకారులను వెనక్కి తగ్గాలని కోరారు. అయినా వారు నిరసనలను కొనసాగించారు.
అసిం మునీర్ పర్యటన తక్కువ సమయంలో భారతదేశంతో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో జరుగుతుండడం గమనార్హం.
Details
మునీర్ తో పాటు ఆసిఫ్ అలీ జార్దారి, షెహబాబ్ షరీఫ్ టార్గెట్
ఈ పర్యటనకు ముందు న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో ట్రక్కుపై ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డులు కూడా తీవ్రంగా విమర్శించాయి.
మునీర్తో పాటు ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారి, ప్రధాని షెహబాజ్ షరీఫ్లను టార్గెట్ చేశారు. ఇక దేశంలో మునీర్ తన అధికారాన్ని మరింత పటిష్టం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ఈ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2023 సాధారణ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ అనుబంధ నాయకులు ఎక్కువగా గెలిచినా, సైనిక మద్దతుతో షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం గట్టి విమర్శలకు దారితీసింది.
ఇమ్రాన్ ఖాన్ అరెస్టు అనంతరం దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ముఖ్యంగా లాహోర్లోని కార్ప్స్ కమాండర్ నివాసంపై దాడులు జరగడం ఉద్రిక్తతకు ఉదాహరణగా నిలిచింది.