NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Khawaja Asif: వెనక్కి తగ్గిన పాకిస్థాన్.. 'దాడులను ఆపండి.. మేము ఏమీ చేయము' పాక్  రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్  
    తదుపరి వార్తా కథనం
    Khawaja Asif: వెనక్కి తగ్గిన పాకిస్థాన్.. 'దాడులను ఆపండి.. మేము ఏమీ చేయము' పాక్  రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్  
    వెనక్కి తగ్గిన పాకిస్థాన్.. 'దాడులను ఆపండి.. మేము ఏమీ చేయము' పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్

    Khawaja Asif: వెనక్కి తగ్గిన పాకిస్థాన్.. 'దాడులను ఆపండి.. మేము ఏమీ చేయము' పాక్  రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్  

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 07, 2025
    12:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం అర్ధరాత్రి పాకిస్థాన్, అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) లోని తొమ్మిది కీలక ప్రాంతాలపై వైమానిక దాడులు జరిపింది.

    'ఆపరేషన్‌ సిందూర్‌'గా పేరుపెట్టిన ఈసైనిక చర్యలో జైష్-ఎ-మొహమ్మద్,లష్కరే-ఎ-తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల ప్రధాన కేంద్రాలతో పాటు మొత్తం తొమ్మిది టార్గెట్లను భారత సైన్యం ధ్వంసం చేసింది.

    ఈదాడిలో దాదాపు 90మంది ఉగ్రవాదులు మృతి చెందినట్టు సమాచారం.

    భారత వైమానిక దాడుల తర్వాత, యుద్ధానికి సిద్ధమని,అణ్వాయుధాలు ఉపయోగిస్తామని హెచ్చరిస్తూ వచ్చిన పాకిస్తాన్ ఇప్పుడు వెనక్కి తగ్గింది.

    యుద్ధం ఆపండి మహా ప్రభో అంటూ భారత్ ముందు మోకరిల్లుతోంది.

    పహల్గామ్ ఘటన అనంతరం భారత్ కీలక దౌత్యపరమైన చర్యలు చేపట్టగా,ఆ సమయంలో పాకిస్తాన్ నాయకత్వం ఓవర్‌కాన్ఫిడెన్స్ చూపించింది.

    వివరాలు 

    భారతదేశం ఎటువంటి తదుపరి చర్య తీసుకోకపోతే..

    అయితే ఇప్పుడు పాకిస్తాన్ పాలకుల మాటల్లో మౌనమే కనిపిస్తోంది.యుద్ధం ముంచుకొచ్చే ప్రమాదం ఉన్న నేపథ్యంలో,కాల్పుల విరమణను స్వయంగా ప్రకటించింది.

    తమను తామే రక్షించుకుంటామని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు.

    ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ,భారతదేశం ఎటువంటి తదుపరి చర్య తీసుకోకపోతే, మేము కూడా ఏమీ చేయమని తెలిపారు.

    భారత్ వైమానిక దాడులకు తొలుత ఘాటుగా స్పందించిన ఖవాజా ఆసిఫ్,కొన్ని గంటల్లోనే తన మాటలను వెనక్కి తీసుకున్నాడు.

    భారత విమానాలు పాకిస్తాన్ గగనతలాన్ని దాటి వచ్చి నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయని, దీనికి తగిన ప్రతిస్పందన ఇస్తామని ఆయన మొదట పేర్కొన్నారు.

    కానీ,అనంతరం తన వ్యాఖ్యలను విరమించుకున్నాడు.భారత్ మరిన్ని చర్యలు తీసుకోకపోతే ,తాము ఏమీ చేయమని చెప్పాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్

    తాజా

    Ap news: మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు.. ఆయన కుటుంబ సభ్యులపై కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
    Encounter: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు,ఉగ్రవాదుల మధ్య కాల్పులు.. ఉగ్రవాది హతం..! జమ్ముకశ్మీర్
    Vacation: అడవుల్లో ఏనుగుల్ని సహజంగా తిరుగుతూ చూడాలనుందా? భారతదేశంలో ఈ ఐదు ప్రదేశాలను తప్పక సందర్శించండి! పర్యాటకం
    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్

    పాకిస్థాన్

    BSF Jawan: పాక్ చెరలో భారత్ జవాన్.. 85 గంటల గడిచినా విడుదల లేదు! ఆర్మీ
    Hanif Abbasi: 130 అణుబాంబులతో భారత్‌పై దాడి చేస్తాం.. పాకిస్థాన్ రైల్వే మంత్రి హెచ్చరిక! భారతదేశం
    Pakistan: పాకిస్థాన్‌ ఆర్థిక సంక్షోభం.. కాసుల్లేని ఆ దేశం యుద్ధానికి సిద్ధమా? అంతర్జాతీయం
    Maharashtra: భారత్‌లో 107 మంది పాకిస్థాన్ పౌరులు మిస్సింగ్.. భద్రతా సంస్థలు అలర్ట్ మహారాష్ట్ర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025