Pakistan: 'మజా రాకుంటే పైసల్ వాపస్'.. భారత్ను రెచ్చగొట్టేలా పాక్ సైన్యాధికారి కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ను ఉద్దేశించి పాకిస్థాన్ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్పిఆర్) డైరెక్టర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి, ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్పై జరుగుతున్న దాడులను భారత్తో జత చేస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. తాజాగా,ఒక పత్రికా సమావేశంలో మహిళా జర్నలిస్టుకు కన్నుకొట్టి విమర్శలు పాలైన చౌదరి, భారత్ను ఎగతాళి చేసే వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, ''ఒకసారి మజా రాకపోతే డబ్బులు వెనక్కి ఇస్తాం'' అని తెలిపారు. సాధారణంగా ప్రత్యర్థులను బెదిరించడానికి, పాపం చేసేవారిని నిర్భయంగా భయపెట్టడానికి ఈ విధమైన వ్యాఖ్యలను ఉపయోగిస్తారు.
వివరాలు
మన విధి మన చేతుల్లోనే..
2026 పాకిస్తాన్కు ఎలా ఉంటుందనేది, మనం ఎలా నిబడుతాము,ఎలా స్పందిస్తామనే దానిపై ఆధారపడి ఉంటుంది. భారత్ ఎప్పటికీ పాకిస్తాన్ ఉనికిని అంగీకరించదు. శత్రువుకు శత్రువు మిత్రుడు అనే విధానంతోనే వ్యవహరిస్తుందని తెలిపారు. అంతేకాక, చౌదరి,''మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి, ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచి రండి,ఎంత మందితో అయినా రండి,ఒక్కసారి మజా చూపించకపోతే డబ్బులు వెనక్కి ఇస్తాం''అని అన్నారు. మన విధి మన చేతుల్లోనే ఉందంటూ,పాకిస్తాన్ దేవుడు ఇచ్చిన బహుమతి అన్నారు. భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కు ప్రాక్సీగా వ్యవహరిస్తోందని కూడా ఆరోపించారు. దీనికి ముందు, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ కూడా భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్ కలిసి నిషేధిత తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (టిటిపి) ద్వారా పాకిస్తాన్కు వ్యతిరేకంగా కుట్రలు చేసుకుంటున్నారని ఆరోపించారు.