
Pahalgam Terror attack: భారత వైమానిక దాడుల భయం.. సియాల్కోట్ ప్రాంతానికి రాడార్ వ్యవస్థలను తరలిస్తున్న పాక్!
ఈ వార్తాకథనం ఏంటి
ఏప్రిల్ 22న పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం తీవ్రమైన నిర్ణయాలను తీసుకుంటోంది.
ఈదాడిలో 26మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.దాంతో ఉగ్రవాదులపై భారత్ ప్రతీకార దాడులకు సిద్ధమవుతోందన్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ తీవ్ర ఆందోళనకు లోనైంది. భారత్ వైమానిక దాడులకు దిగొచ్చన్న భయంతో, తమ రక్షణ వ్యవస్థను పటిష్టం చేసేందుకు పాకిస్థాన్ చర్యలు చేపడుతోంది.
అత్యవసర స్థాయిలో నియంత్రణరేఖ వద్ద తన బలగాలను పాకిస్థాన్ అప్రమత్తం చేసింది.
భారత్ ఏదైనా వైమానిక దాడి చేస్తే వెంటనే గుర్తించేందుకు సియాల్కోట్ ప్రాంతంలో రాడార్ వ్యవస్థలను స్థాపిస్తోంది.
భారత వైమానిక చర్యలను ముందుగా తెలుసుకునేందుకు అనేక సాంకేతిక చర్యలు చేపడుతున్నట్లు పాక్ మీడియా కథనాల్లో పేర్కొనబడింది.
వివరాలు
ఫ్రంట్లైన్ యుద్ధ విమానాలతో భారీ స్థాయిలో సైనిక విన్యాసాలు
ఇలాంటి చర్యలలో భాగంగా, అంతర్జాతీయ సరిహద్దుకు 58కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖోర్ కంటోన్మెంట్ వద్ద టీపీఎస్-77 రాడార్ సైట్ను పాకిస్థాన్ ఏర్పాటుచేసింది.
ఈ టీపీఎస్-77 మల్టీ-రోల్ రాడార్(MRR)ఒక అత్యాధునిక,బహుళ ప్రయోజనాల కలిగిన రాడార్ వ్యవస్థ. ఇది ప్రపంచవ్యాప్తంగా హవామాన పరిస్థితులు,విమానాల చలనాన్ని గమనించేందుకు, అలాగే ఎయిర్ ట్రాఫిక్ను పర్యవేక్షించేందుకు ఉపయోగిస్తారు.
ఇక ఇంకోవైపు, భారత్ ఇటీవల రఫేల్ జట్లు, ఇతర ఫ్రంట్లైన్ యుద్ధ విమానాలతో భారీ స్థాయిలో సైనిక విన్యాసాలు నిర్వహించింది.
ఇదే సమయంలో భారత నౌకాదళం కూడా అన్ని రకాల అత్యవసర పరిస్థితులకు ఎదుర్కొనేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
పహల్గాం దాడి నేపథ్యంలో, పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే)ప్రాంతంలో ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను ఖాళీ చేయించేందుకు పాకిస్థాన్ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
ఉగ్రవాదులను అక్కడి ఆర్మీ షెల్టర్లకు లేదా బంకర్లకు తరలించేందుకు ప్రయత్నాలు
ఉగ్రవాదులను అక్కడి ఆర్మీ షెల్టర్లకు లేదా బంకర్లకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని నిఘా వర్గాల సమాచారం.
జాతీయ మీడియాలో వెలువడిన కథనాల ప్రకారం, ఈ చర్యలు భయభ్రాంతితో కూడినవిగా భావించవచ్చు.
ఇదిలా ఉండగా, పాక్ రక్షణశాఖ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
"భారత వైమానిక దాడులు జరగబోతున్నాయని తెలుస్తోంది. అందుకే మేము మా బలగాలను అప్రమత్తం చేసాము. సమయానికి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మేము ఇప్పటికే కొన్ని చర్యలు ప్రారంభించాము" అని ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
అయితే, ఈ ఆందోళనకు కారణమైన ఖచ్చితమైన సమాచారం ఏమిటో మాత్రం మంత్రి వివరించలేదు.