Pakistan: పాకిస్థాన్లో ఐఈడీ పేలుడు.. గిరిజన తెగ నాయకుడు సహా ముగ్గురు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ వాయవ్య ప్రాంతంలో సోమవారం జరిగిన ఐఈడీ పేలుడులో గిరిజన తెగ నాయకుడు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు సమీపంలోని దక్షిణ వజిరిస్తాన్ జిల్లాలోని వానా మార్కెట్ ప్రాంతంలో ఈ పేలుడు జరిగింది. ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోసివ్ డివైస్ (IED) ద్వారా ఈ దాడి నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో అహ్మద్జై తెగ పెద్ద ప్రయాణిస్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి జరిగినట్లు జిల్లా పోలీస్ చీఫ్ మహ్మద్ తాహిర్ మీడియాకు తెలిపారు.
వివరాలు
దక్షిణ వజిరిస్తాన్ ప్రాంతం తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రం
మృతుల్లో ఆ తెగ నాయకుడు కూడా ఉన్నారు. దక్షిణ వజిరిస్తాన్ ప్రాంత జనాభాలో 60 శాతానికి పైగా అహ్మద్జై తెగవారే ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఈ దాడికి ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. అశాంతికి కేంద్రంగా పేరున్న దక్షిణ వజిరిస్తాన్ ప్రాంతం గతంలో తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా ఉండేది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పాక్లో బాంబు పేలుడు కలకలం.. నలుగురికి గాయాలు
IED blast in Wana, KP kills tribal chief Malik Tariq Wazir, 2 others
— NationPress (@np_nationpress) May 18, 2026
IED blast in Wana, Khyber Pakhtunkhwa kills tribal chief Malik Tariq Wazir and two others on 18 May; four injured as HRCP warns of worsening militant violence.https://t.co/lx2j7OxJgI pic.twitter.com/WL260kMiAo