NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Pm Modi: 'శాంతియుత' పరిష్కారానికి భారతదేశం మద్దతు.. జెలెన్‌స్కీతో భేటీ అయిన మోదీ 
    తదుపరి వార్తా కథనం
    Pm Modi: 'శాంతియుత' పరిష్కారానికి భారతదేశం మద్దతు.. జెలెన్‌స్కీతో భేటీ అయిన మోదీ 
    జెలెన్‌స్కీతో భేటీ అయిన మోదీ

    Pm Modi: 'శాంతియుత' పరిష్కారానికి భారతదేశం మద్దతు.. జెలెన్‌స్కీతో భేటీ అయిన మోదీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 24, 2024
    08:42 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా పర్యటనలో భాగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు.

    ఈ సమావేశంలో, ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు భారతదేశం పూర్తి మద్దతును మోదీ పునరుద్ఘాటించారు.

    దాదాపు నెల రోజుల వ్యవధిలో, జెలెన్‌స్కీ, మోదీల మధ్య ఇది రెండో భేటీ కావడం గమనార్హం.

    భేటీ జరిగిన విషయాన్ని ప్రధాని మోదీ ఎక్స్‌ వేదికలో ప్రకటించారు. గత నెలలో ఉక్రెయిన్ పర్యటన సందర్భంగా, ఆ దేశంలో శాంతి స్థాపనకు భారత్‌ కట్టుబడి ఉందని, శాశ్వతంగా, శాంతియుత పరిష్కారం కోసం అన్ని విధాలా సహకరించడానికి సిద్ధంగా ఉందని మోదీ పేర్కొన్నారు.

    వివరాలు 

    మోదీ భారత్‌కు తిరుగు ప్రయాణం

    జెలెన్‌స్కీ మాట్లాడుతూ,"మేము ఇరుదేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తున్నాం. వివిధ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నాం. అంతర్జాతీయ వేదికలపై,ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి,జీ20 సమావేశాల్లో శాంతి సూత్రాన్ని అమలు చేయడంపై చర్చించాము. మన సార్వభౌమాధికారం,ప్రాదేశిక సమగ్రతకు మీరు ఇచ్చిన మద్దతుకు కృతజ్ఞతలు" అన్నారు.

    గత నెలలో ఉక్రెయిన్ పర్యటన సమయంలోనూ జెలెన్‌స్కీ, మోదీల మధ్య సమావేశం జరిగింది.

    ఈ సమావేశంలో రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై చర్చలు జరగగా,ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు భారత్ మద్దతుగా నిలుస్తుందని మోదీ స్పష్టం చేశారు.

    ఇదిలావుండగా,ఐరాస సదస్సు అనంతరం మోదీ,జెలెన్‌స్కీతో పాటు ఆర్మేనియా ప్రధాన మంత్రి పాషిన్‌యాన్‌ వంటి ఇతర నేతలతో కూడా ద్వైపాక్షిక భేటీలు నిర్వహించారు.

    మూడు రోజుల అమెరికా పర్యటనను ముగించుకుని,మోదీ మంగళవారం భారత్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    జెలెన్‌స్కీ

    తాజా

    Hari Hara Veera Mallu: 'హరిహర వీరమల్లు' కొత్త రిలీజ్ డేట్‌ ను ప్రకటించిన టీమ్‌.. ఎప్పుడంటే?  హరిహర వీరమల్లు
    Kashmir: కశ్మీర్‌కు మునుపటిలా పర్యాటకులు వచ్చేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది: రామ్మోహన్‌నాయుడు  కింజరాపు రామ్మోహన్ నాయుడు
    IPL 2025: స్టార్క్‌ ఔట్‌.. హేజిల్‌వుడ్‌ ఇన్‌! దిల్లీకి ఎదురుదెబ్బ, ఆర్సీబీకి ఊరట  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Zomato Gold and Swiggy One: జొమాటో-స్విగ్గీ కస్టమర్లకు భారీ షాక్.. వారికీ ఆర్డర్లపై కొత్త సర్‌ఛార్జ్ ఫిక్స్.. జొమాటో

    నరేంద్ర మోదీ

    Telangana: తెలంగాణలోని వర్షాలు, వరద పరిస్థితులపై  ప్రధాని, అమిత్‌షా ఆరా  తెలంగాణ
    Narendra Modi: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు.. సాయం చేస్తానని హామీ ఇచ్చిన మోదీ తెలంగాణ
    Narendra Modi: పారాలింపిక్స్‌లో దేశాన్ని గర్వపడేలా చేశారు : మోదీ  పారిస్ ఒలింపిక్స్
    Huge funds: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైతాంగం కోసం భారీగా నిధులు కేటాయింపు  కేంద్ర కేబినెట్

    జెలెన్‌స్కీ

    ఉక్రెయిన్- రష్యా యుద్ధాన్ని ఆపే శక్తి మోదీకి ఉంది: ఆమెరికా వ్లాదిమిర్ పుతిన్
    అదనపు మానవతా సాయం కోరుతూ మోదీకి లేఖ రాసిన జెలెన్‌స్కీ  ఉక్రెయిన్
    మోదీజీ, యుద్ధాన్ని ముగించే శాంతి ప్రతిపాదనకు మద్దతు తెలపండి; జెలెన్‌స్కీ అభ్యర్థన నరేంద్ర మోదీ
    రిషి సునక్ తల్లి చేసిన 'బర్ఫీ'ని రుచి చూసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ రిషి సునక్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025