NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Maldives: 'అప్పటిలోగా మాల్దీవుల నుంచి భారత సైన్యం వెళ్లిపోవాలి'.. ముయిజ్జు అల్టిమేటం
    తదుపరి వార్తా కథనం
    Maldives: 'అప్పటిలోగా మాల్దీవుల నుంచి భారత సైన్యం వెళ్లిపోవాలి'.. ముయిజ్జు అల్టిమేటం
    Maldives: 'అప్పటిలోగా మాల్దీవుల నుంచి భారత సైన్యం వెళిపోవాలి'.. ముయిజ్జు అల్టిమేటం

    Maldives: 'అప్పటిలోగా మాల్దీవుల నుంచి భారత సైన్యం వెళ్లిపోవాలి'.. ముయిజ్జు అల్టిమేటం

    వ్రాసిన వారు Stalin
    Jan 15, 2024
    10:20 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మాల్దీవులు, భారత్‌ల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా భారత సైన్యానికి మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు అల్టిమేటం జారీ చేశారు.

    మార్చి 15లోగా మాల్దీవుల నుంచి భారత్ తమ సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని అధికారంగా వెల్లడించారు.

    ఈ విషయాన్ని మాల్దీవుల అధ్యక్ష కార్యాలయ అధికార ప్రతినిధి అబ్దుల్లా నజీమ్ ఇబ్రహీం తెలిపారు.

    ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల రాజకీయ నాయకులు అవమానకర వ్యాఖ్యల తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య పరమైన వార్ నడుస్తున్న విషయం తెలిసిందే.

    ఈరోజు (జనవరి 14) మాల్దీవుల రాజధాని మాలేలో మాల్దీవుల విదేశాంగ శాఖ అధికారులతో భారత హైకమిషన్ అధికారులు సమావేశం నిర్వహించారు.

    మోదీ

    రెండు దేశాల మధ్య ఆదివారం అధికారిక చర్చలు 

    దళాల ఉపసంహరణకు సంబంధించి రెండు దేశాల మధ్య ఆదివారం అధికారిక చర్చలు జరిగాయని మాల్దీవుల వార్తాపత్రిక సన్ ఆన్‌లైన్ ఇంటర్నేషనల్ పేర్కొంది.

    ఇరు దేశాల మధ్య ఈ సమస్యను పరిష్కరించడానికి ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేశారు. దాని సభ్యులు కూడా సమావేశానికి హాజరయ్యారు.

    సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని ముయిజు భారత్‌ను కోరడం ఇదే మొదటిసారి కాదు.

    ముయిజ్జు అధ్యక్షుడు అయిన తర్వాత భారత్ నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.

    అయితే అప్పుడు గడవు విధించలేదు. ఇప్పుడు గడువు విధంచడం గమనార్హం.

    మాల్దీవులు

    సైనికులకు సంబంధించిన వివాదం ఏమిటి?

    మాల్దీవుల్లో 70 మందికి పైగా భారతీయ సైనికులు ఉన్నారు.

    కోస్టల్ రాడార్ ఆపరేషన్‌తో పాటు భారతదేశం మాల్దీవులకు బహుమతిగా ఇచ్చిన విమానాల మరమ్మతు వంటి పనుల కోసం ఈ సైనికులను మోహరించారు.

    ఈ గస్తీ అనేది భారత్‌కు వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దీని ద్వారా హిందూ మహాసముద్రాన్ని పర్యవేక్షించడం ఈజీ అవుతుంది.

    ఇదిలా ఉంటే, ముయిజ్జు ఇటీవల 5 రోజుల చైనా పర్యటనకు వెళ్లారు. చైనా నుంచి తిరిగిన వచ్చిన తర్వాత.. అధ్యక్షుడు ముయిజ్జూ భారత్‌పై పరోక్ష విమర్శలు చేశారు.

    తమ దేశం చిన్నదే అయినా తనను బెదిరించే హక్కు ఎవరికీ లేదని భారత్‌ను ఉద్దేశించి పరోక్షంగా అనడం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మాల్దీవులు
    భారతదేశం

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    మాల్దీవులు

    మాల్దీవుల్లో భారత హైకమిషన్‌పై దాడికి కుట్ర.. స్పందించిన విదేశాంగ శాఖ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి
    #Boycott Maldives: భారత్‌పై మాల్దీవ్స్ నేతల అక్కసు.. ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ మాల్దీవ్స్ హ్యాష్‌ట్యాగ్  తాజా వార్తలు
    Maldives: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. ఇద్దరు మంత్రులను సస్పెండ్ చేసిన మాల్దీవులు సర్కార్  తాజా వార్తలు
    Lakshadweep MP: మోదీ భారత పర్యాటకంపై స్పందిస్తే మాల్దీవులకు వచ్చిన సమస్య ఏంటి?: లక్షద్వీప్ ఎంపీ నరేంద్ర మోదీ

    భారతదేశం

    India : నిజ్జర్ కేసులో భారత్ కీలక వ్యాఖ్యలు..ఆధారాలుంటే చూపించాలన్న జైశంకర్ కెనడా
    India aid: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. గాజాకు రెండో విడత సాయాన్ని పంపిన భారత్  పాలస్తీనా
    E-visa services for Canada : రెండు నెలల తరువాత  కెనడియన్లకు ఈ-వీసా సేవలను పునఃప్రారంభించిన భారత్  భారతదేశం
    qatar: భారత నేవీ అధికారులకు మరణశిక్ష రద్దుపై భారత్ విజ్ఞప్తి.. ఆమోదించిన ఖతర్ ఖతార్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025