NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / అమెరికా విదేశాంగ శాఖ అత్యున్నత పదవిలో భారత సంతతి వ్యక్తి రిచర్డ్ వర్మ
    తదుపరి వార్తా కథనం
    అమెరికా విదేశాంగ శాఖ అత్యున్నత పదవిలో భారత సంతతి వ్యక్తి రిచర్డ్ వర్మ
    రిచర్డ్ వర్మకు కీలక పదవిని కట్టబెట్టిన బైడెన్

    అమెరికా విదేశాంగ శాఖ అత్యున్నత పదవిలో భారత సంతతి వ్యక్తి రిచర్డ్ వర్మ

    వ్రాసిన వారు Stalin
    Dec 24, 2022
    11:28 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో భారత సంతతి వ్యక్తికి కీలక పదవిని కట్టబెట్టాడు. భారతీయ మూలాలున్న రిచర్డ్ వర్మను అమెరికా విదేశాంగ శాఖలో మేనేజ్‌మెంట్ అండ్ రిసోర్సెస్ డిప్యూటీ సెక్రటరీగా నామినేట్ చేశారు.

    వర్మ ప్రస్తుతం మాస్టర్‌కార్డ్‌లో చీఫ్ లీగల్ ఆఫీసర్, గ్లోబల్ పబ్లిక్ పాలసీ హెడ్‌గా ఉన్నారు. ఒబామా హయాంలో అతను భారతదేశంలో యునైటెడ్ స్టేట్స్ రాయబారి, లెజిస్లేటివ్ వ్యవహారాల సహాయ కార్యదర్శిగా పనిచేశారు. అంతకుముందు వర్మకు అమెరికా సెనేటర్ హ్యారీ రీడ్కి జాతీయ భద్రతా సలహాదారుగా పని చేసిన అనుభవం కూడా ఉంది.

    రిచర్డ్ వర్మ

    అనేక అవార్డులు, రివార్డులు..

    ప్రభుత్వ పరంగానే కాకుండా.. ప్రైవేటు రంగంలో కూడా విశిష్ట సేవలు అందించారు వర్మ. ఆసియా గ్రూప్ వైస్ ఛైర్మన్‌గా, స్టెప్‌టో అండ్ జాన్సన్ ఎల్ఎల్‌పీలో భాగస్వామిగా, సీనియర్ కౌన్సెలర్‌గా పనిచేశారు. ఆల్‌బ్రైట్ స్టోన్‌బ్రిడ్జ్ గ్రూప్‌లో సీనియర్ కౌన్సెలర్‌గా ఉన్నారు. యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్‌లో కూడా పని చేసిన అనుభవం అతనికి ఉంది.

    అలాగే.. రిచర్డ్ వర్మ అందించిన సేవలకు ఆయన్ను చాలా అవార్డులు వరించాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ నుంచి విశిష్ట సేవా పతకం, కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ నుంచి ఇంటర్నేషనల్ అఫైర్స్ ఫెలోషిప్, యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ నుంచి మెరిటోరియస్ సర్వీస్ మెడల్‌తో అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రపంచం

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    ప్రపంచం

    T 20 సారిథిగా హార్థిక్ పాండ్యా..! క్రికెట్
    కుల్దీప్‌ను పక్కన పెట్టడం.. నమ్మశక్యంగా లేదు : గవాస్కర్‌ క్రికెట్
    మినీ ఐపీఎల్ వేలంలో రికార్డులు బద్దలవుతాయా..? క్రికెట్
    సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్‌‌ విడుదలకు కారణం అదేనట! అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025