Ukraine: జెలెన్ స్కీను మాస్కోకు ఆహ్వానించిన రష్యా.. భద్రతకు హామీ..
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నాలుగేళ్లుగా కొనసాగుతోంది.ఇరు దేశాలు ఘోర దాడులు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే రెండు దేశాల్లో భారీ నష్టం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో, డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా పదవికి వచ్చిన తర్వాత యుద్ధాన్ని ఆపేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ, ఇప్పటివరకు స్పష్టమైన ఫలితాలు రాలేదు. తొలుత సౌదీ అరేబియాలో చర్చలు జరిగాయి, కానీ ఫలితాలు వెలువడలేదు. ఆ తర్వాత ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగి,అలాస్కాలో వేదికగా రష్యా అధ్యక్షుడు పుతిన్తో సమావేశమయ్యారు. తరువాత, వైట్హౌస్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, యూరోపియన్ యూనియన్ దేశాధినేతలతో ట్రంప్ సమావేశమై చర్చలు జరిపారు. అయినప్పటికీ, సమస్య పరిష్కారానికి దారి కనిపించలేదు.
వివరాలు
ఈ ఆహ్వానంపై స్పందించని జెలెన్స్కీ
తాజాగా 28 పాయింట్ల ప్రణాళిక ప్రతిపాదించారు. ఈ ప్రణాళిక రష్యాకు నచ్చింది గానీ.. జెలెన్స్కీకి నచ్చలేదు. ట్రంప్ దూతలు ఇరు పక్షాలతో చర్చలు జరిపినా ఫలితం దక్కలేదు. గత వారం,అమెరికా మధ్యవర్తిత్వంలో అబుదాబిలో చర్చలు జరిగాయి. మరోసారి, ఈ ఆదివారం కూడా చర్చలు కొనసాగనున్నాయి. ఈ క్రమంలో, రష్యా తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని శాంతి చర్చలకు ఆహ్వానించింది. మాస్కోకు రావాలని కోరింది. గత ఏడాదికీ ఇదే ప్రయత్నం జరిగింది, కానీ జెలెన్స్కీ ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఈసారి రష్యా పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి మాస్కోకు రావాలని అభ్యర్థించింది. అయితే, ఇప్పటి వరకు జెలెన్స్కీ ఈ ఆహ్వానంపై స్పందించలేదు.
వివరాలు
జపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్ విషయంలో ప్రధాన విభేదాలు
జెలెన్స్కీ-పుతిన్ మధ్య సమావేశం ఏర్పాటు చేయడానికి చాలా దగ్గరగా ఉందని అమెరికాకు చెందిన ఒక అధికారి ఆక్సియోస్తో వెల్లడించారు. ఇక అబుదాబి వేదికగా మంచి చర్చలు జరుగుతున్నాయని మంగళవారం ట్రంప్ కూడా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం, భూభాగాల మార్పులపై ఏ నిర్ణయం తీసుకోవడం కష్టమవుతోంది. రష్యా నియంత్రణలో ఉన్న జపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్ విషయంలో ప్రధాన విభేదాలు కొనసాగుతున్నాయి. అందువల్ల, ఎవరికి ఏ భూభాగం లభిస్తుందన్నది ఇరు పక్షాల మధ్య ఉన్న భిన్న అభిప్రాయాలను సమర్ధవంతంగా పరిష్కరించడం కష్టం అని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో బుధవారం తెలిపారు. మొత్తానికి ఏం జరుగుతుందో వేచి చూడాలి.