Russia-Ukraine: ఉక్రెయిన్పై రష్యా భారీ క్షిపణి, డ్రోన్ దాడులు.. కీవ్లో ఆరుగురు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్పై రష్యా మరోసారి భారీ స్థాయిలో క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. శనివారం అర్ధరాత్రి ప్రారంభమైన ఈ దాడులు పలుగంటల పాటు కొనసాగాయి. మొత్తం 41 క్షిపణులు, 125 డ్రోన్లను ప్రయోగించినట్లు సమాచారం. ప్రధానంగా రాజధాని కీవ్ను లక్ష్యంగా చేసుకుని రష్యా బాలిస్టిక్ క్షిపణులతో దాడులు నిర్వహించింది. ఈ దాడుల ప్రభావంతో కీవ్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. పలుచోట్ల ఆస్తి నష్టం కూడా సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు, రష్యా భూభాగంలోని ఇంధన మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని ఆదివారం తాము ప్రతిదాడులు నిర్వహించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రష్యా దాడులతో కీవ్లో విషాదం.. ఆరుగురు మృతి
#UkraineRussiaWar
— The Independent (@Independent) July 20, 2026
🔴 Russian oil depots hit after Putin launches ballistic missile attack on Kyivhttps://t.co/r3Vh53FieD