ఉక్రెయిన్ రెస్టారెంట్పై క్షిపణులతో రష్యా దాడి ; నలుగురు మృతి
ఉక్రెయిన్పై రష్యా భీకరంగా దాడులు చేస్తోంది. క్షిపణులతో విరుచుపడుతోంది. తాజాగా తూర్పు ఉక్రెయిన్ నగరమైన క్రామాటోర్స్క్ను రెండు రష్యా క్షిపణులు ఢీ కొన్నాయి. ఈ దాడిలో నలుగురు గాయపడ్డారు. మరో 42మంది గాయపడ్డారు. మొదటి క్షిపణి రెస్టారెంట్ను ఢీకొట్టింది. దీంతో రెస్టారెంట్ భవనం ధ్వంసమైంది. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. రెండో క్షిపణి క్రామాటోర్స్క్ శివార్లలోని ఓ గ్రామాన్ని ఢీకొట్టింది. ఈ రెండు చోట్ల కలిపి నలుగురు చనిపోయారు. అలాగే ఉక్రెయిన్కు పశ్చిమాన ఉన్న క్రెమెన్చుక్ నగరాన్ని రష్యన్ క్షిపణి ఢీకొంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. క్రెమెన్చుక్లోని ఒక షాపింగ్ మాల్పై ఏడాది క్రితం కూడా రష్యా క్షిపణులతో దాడి చేసింది. ఈ డాదిలో 20మంది చనిపోయారు.