LOADING...
Russia-India: నడిసంద్రంలో రష్యన్ ఆయిల్ ట్యాంకర్ యూ-టర్న్.. భారత్‌కు సరఫరా సులభం
నడిసంద్రంలో రష్యన్ ఆయిల్ ట్యాంకర్ యూ-టర్న్.. భారత్‌కు సరఫరా సులభం

Russia-India: నడిసంద్రంలో రష్యన్ ఆయిల్ ట్యాంకర్ యూ-టర్న్.. భారత్‌కు సరఫరా సులభం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 18, 2026
05:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రపంచ దేశాలు సంక్షోభంతో పాల్పడుతున్నా, భారత్‌ మాత్రం సేఫ్ జోన్‌లో నిలిచింది. చాలా దేశాల్లో చమురు, గ్యాస్‌ కొరత తీవ్రంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌కు శుభసమాచారం అందింది. చైనాకు వెళ్తున్న రష్యన్ ఆయిల్‌ ట్యాంకర్‌ డ్రాగన్‌ మధ్యలో దిశ మార్చి భారత్ వైపు U-టర్న్‌ తీసుకున్నట్లు షిప్-ట్రాకింగ్ డేటా సూచిస్తోంది. దీని కారణంగా భారీ మోతాదులో చమురు భారత్‌కు చేరబోతోంది. ఉగాది పండుగ వేళ ఇది ప్రత్యేకంగా శుభసందేశంగా చెప్పుకోవచ్చు. హార్ముజ్‌ జలసంధిలో అడ్డంకుల్లో చిక్కుకున్న భారత్ ట్యాంకర్లకు ఇరాన్ ప్రభుత్వం సులభ మార్గాన్ని కల్పించింది. తాజా సమాచారం ప్రకారం రష్యన్‌ ట్యాంకర్ మార్చి 21న న్యూ మంగళూరుకు చేరనుంది.

Details

భారత్‌కు 30 రోజుల మినహాయింపు

ప్రారంభంలో ఆక్వా టైటాన్‌ ట్యాంకర్ చైనాకు వెళ్ళేలా ప్లాన్ చేశారు. కానీ అకస్మాత్తుగా దిశ మార్చి భారత్ వైపు మారింది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా చమురు కొరత తలెత్తకుండా, రష్యా చమురు కొనుగోలు కోసం అమెరికా భారత్‌కు 30 రోజుల మినహాయింపు ఇచ్చిందని కొన్ని వార్తా వర్గాలు వెల్లడించాయి. అయితే భారత్ ఈ ప్రకటనను ఖండించి, రష్యా చమురు కొనుగోలుకు ఏ దేశ అనుమతిపైనా ఆధారపడనని స్పష్టంగా వెల్లడించింది. ఇలాంటి పరిణామాల ఫలితంగా భారత్‌ చమురు సరఫరా సమస్యలతో ఇబ్బందిపడకుండా, ఆర్ధిక పరిస్థితులను స్థిరంగా ఉంచగలదు.

Advertisement