Shehbaz Sharif: "పాక్ 'కాపీ-పేస్ట్' దౌత్యం".. 'డ్రాఫ్ట్ ట్వీట్'తో షరీఫ్ బొక్కబోర్లా.. పాక్ దౌత్యంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ!
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ మరోసారి అంతర్జాతీయ వేదికపై విమర్శల పాలైంది. ఈసారి కారణం ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన చిన్న పొరపాటు. అయితే ఆ తప్పు ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీసింది. ముఖ్యంగా ఇరాన్ సంక్షోభం నేపథ్యంలో పాకిస్థాన్ పాత్రపై అనుమానాలు పెరుగుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఉద్దేశిస్తూ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఒక ట్వీట్ చేశారు. ఇరాన్పై విధించిన గడువును మరో రెండు వారాలు పొడిగించాలని ఆయన కోరారు. దౌత్యపరమైన చర్చలకు అవకాశం ఇవ్వాలని సూచించారు. అలాగే 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్'ను తిరిగి తెరవాలని ఇరాన్కు విజ్ఞప్తి చేశారు.
వివరాలు
ట్వీట్ ఎడిట్ హిస్టరీ
ఇంతవరకు చూస్తే సాధారణ దౌత్య ప్రకటనలా అనిపించింది. కానీ, ట్వీట్ చేసిన కొద్దిసేపటికే దాన్ని ఎడిట్ చేయడం కొత్త అనుమానాలకు కారణమైంది. ఈ మార్పును గమనించిన సోషల్ మీడియా వినియోగదారులు వెంటనే స్పందించారు. ట్వీట్ ఎడిట్ హిస్టరీని పరిశీలించినప్పుడు అసలు విషయం బయటపడింది. మొదటిగా పోస్ట్ చేసిన వెర్షన్లో "Draft - Pakistan's PM Message on X" అనే వాక్యం ఉండటం సంచలనంగా మారింది. దీంతో ఈ సందేశం పాక్ ప్రభుత్వం స్వయంగా రూపొందించిందా అనే ప్రశ్నలు తలెత్తాయి.
వివరాలు
పాకిస్థాన్ ప్రభుత్వాన్ని డొనాల్డ్ ట్రంప్ ప్రభావితం చేస్తున్నారా?
సోషల్ మీడియాలో దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరో ముందుగా సిద్ధం చేసిన స్క్రిప్ట్ను షరీఫ్ యథాతథంగా కాపీ చేసి పోస్ట్ చేశారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా వైట్ హౌస్ నుంచి వచ్చిన సూచనలను తొలగించడం మర్చిపోయారని ప్రచారం జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించిన స్క్రీన్షాట్లు కూడా విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో "పాకిస్థాన్ ప్రభుత్వాన్ని డొనాల్డ్ ట్రంప్ ప్రభావితం చేస్తున్నారా?" అనే చర్చ మొదలైంది. పాక్ నాయకత్వం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. బయట శక్తుల ప్రభావంతోనే ఇలాంటి ప్రకటనలు వెలువడుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
వివరాలు
పాకిస్థాన్ మధ్యవర్తిత్వం
ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, పాకిస్థాన్ మధ్యవర్తిత్వం చేస్తోంది. ఇరు దేశాల మధ్య సందేశాలను చేరవేస్తూ కీలక పాత్ర పోషిస్తున్నట్లు చెబుతోంది. "దౌత్య ప్రయత్నాలు వేగంగా కొనసాగుతున్నాయి. యుద్ధానికి ముగింపు పలకాలంటే గడువు పొడిగించడం అవసరం" అని షరీఫ్ తన సందేశంలో పేర్కొన్నారు. అయితే, ఈ 'డ్రాఫ్ట్ ట్వీట్' వివాదం ఆయన అసలు ఉద్దేశాన్ని మసకబార్చింది. దౌత్య పరంగా చెప్పిన మాటలకంటే, చేసిన పొరపాటు మీదే ఇప్పుడు ప్రపంచ దృష్టి నిలిచింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సోషల్ మీడియాలో ట్రోల్స్ వర్షం
Did the US instruct Pakistan’s PM on what to post on X?
— Aditya Raj Kaul (@AdityaRajKaul) April 7, 2026
An earlier post by Shehbaz Sharif appeared to include drafting instructions telling Pakistan’s PM what to publish and instead of deleting and reposting, the post was quietly edited.
So the question is obvious:
Are… pic.twitter.com/6qZVYu2EEP
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సోషల్ మీడియాలో ట్రోల్స్ వర్షం
What is this lol?😂😂😂 pic.twitter.com/QXQYzrBmSW
— Jessie 🇮🇷 (@Maddyhammy) April 8, 2026