LOADING...
Sherry Singh: మిస్‌ యూనివర్స్‌ 2025 కిరీటాన్ని దక్కించుకున్న షెర్రీ సింగ్
మిస్‌ యూనివర్స్‌ 2025 కిరీటాన్ని దక్కించుకున్న షెర్రీ సింగ్

Sherry Singh: మిస్‌ యూనివర్స్‌ 2025 కిరీటాన్ని దక్కించుకున్న షెర్రీ సింగ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 13, 2025
09:59 am

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ అందాల పోటీలలో భారత పతాకం రెపరెపలాడింది. భారతానికి చెందిన షెర్రీ సింగ్‌ 2025 మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా ఆమె తన పేరును లిఖించుకుంది. ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో జరిగిన 48వ ఎడిషన్‌లో ప్రపంచవ్యాప్తంగా 120 మంది పాల్గొన్న పోటీలో షెర్రీ సింగ్‌ విజేతగా నిలిచారు. ఆమె ఈ విజయాన్ని సాధించిన తర్వాత భారత జెండాను చేతబట్టి తీవ్ర భావోద్వేవానికి గురయ్యారు.

Details

వ్యక్తిగత జీవితం 

షెర్రీ సింగ్‌ 9 సంవత్సరాల క్రితం వివాహమై, ఒక కుమారుడు ఉన్నారు. విజేతగా ప్రకటించిన తర్వాత మాట్లాడుతూ ఈ విజయం కేవలం నా ఒక్కదానిదే కాదు. హద్దులు దాటి కలలు కనే ప్రతి మహిళదీ. బలం, దయ, పట్టుదల మహిళ నిజమైన అందానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ చరిత్రాత్మక విజయం భారత్‌కు గర్వాన్నిస్తుందని మిస్‌ యూనివర్స్‌ పోటీ నిర్వాహకులు ప్రశంసించారు. షెర్రీకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.