LOADING...
Ukraine: సైనికుల స్థానంలో స్మార్ట్ రోబోలు.. ఉక్రెయిన్ యుద్ధంలో విప్లవాత్మక మార్పు!
సైనికుల స్థానంలో స్మార్ట్ రోబోలు.. ఉక్రెయిన్ యుద్ధంలో విప్లవాత్మక మార్పు!

Ukraine: సైనికుల స్థానంలో స్మార్ట్ రోబోలు.. ఉక్రెయిన్ యుద్ధంలో విప్లవాత్మక మార్పు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 20, 2026
02:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

యుద్ధరంగంలో శత్రువుకు లొంగిపోవడం అనేది ఎప్పటి నుంచో చూస్తున్న దృశ్యమే. కానీ ఇప్పుడు యుద్ధ స్వరూపం పూర్తిగా మారుతోంది. ఈసారి ఇద్దరు రష్యన్ సైనికులు చేతులు పైకెత్తి లొంగిపోయారు... అయితే వారిని పట్టుకుంది మనుషులు కాదు. కిలోమీటర్ల దూరంలో ఉన్న యుక్రెయిన్ సైనికులు నియంత్రిస్తున్న భూభాగ రోబోట్లు. ఇది భవిష్యత్ యుద్ధానికి నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్‌కు చెందిన "NC13" యూనిట్ కమాండర్ మైకొలా జింకెవిచ్ తెలిపిన ప్రకారం, గత వేసవిలో జరిగిన ఈ ఆపరేషన్‌లో ఒక్క గుండూ కాల్చకుండా శత్రు స్థావరాన్ని స్వాధీనం చేసుకున్నారు. భూభాగ రోబోట్లు, డ్రోన్ల సహాయంతో ఇలాంటి ఆపరేషన్ జరగడం ఇదే తొలిసారి అని ఆయన పేర్కొన్నారు.

వివరాలు

వాతావరణ పరిస్థితులకు తట్టుకోగలవు

అప్పటి నుంచి ఇలాంటి మిషన్లు రోజువారీ కార్యకలాపాలుగా మారిపోయాయి. యుక్రెయిన్ యుద్ధరంగంలో ఇప్పటికే డ్రోన్ల వినియోగం విస్తృతంగా పెరిగింది. దీంతో కాలినడక సైనికులకు ప్రమాదం ఎక్కువైంది. దీనికి ప్రత్యామ్నాయంగా యుక్రెయిన్ భూభాగ డ్రోన్లు, రోబోటిక్ వ్యవస్థలను అభివృద్ధి చేసింది. మొదట ఇవి గాయపడిన సైనికులను తరలించడానికి, సరఫరాలు పంపడానికి ఉపయోగించేవారు. ఇప్పుడు నేరుగా యుద్ధంలోనూ వినియోగిస్తున్నారు. భూభాగ డ్రోన్ల ప్రత్యేకత ఏమిటంటే... ఇవి అన్ని వాతావరణ పరిస్థితుల్లో పనిచేస్తాయి. ఎక్కువ బరువు మోయగలవు. అలాగే ఎక్కువ కాలం పనిచేసే సామర్థ్యం కూడా ఉంది. గతేడాది యుక్రెయిన్ మూడో ఆర్మీ కార్ప్స్ సమాచారం ప్రకారం, ఒకే ఒక్క రోబోట్ 45 రోజుల పాటు రష్యా దళాల దాడిని అడ్డుకుంది.

వివరాలు

యుక్రెయిన్‌ లో సైనికుల సంఖ్య తక్కువ

యుక్రెయిన్‌కు రష్యాతో పోలిస్తే సైనికుల సంఖ్య తక్కువ. అందుకే సాంకేతికత ద్వారానే ఆధిక్యం సాధించాలన్నదే లక్ష్యమని జింకెవిచ్ తెలిపారు. ఈఏడాదిలోనే సైన్యంలో మూడో వంతు కాలినడక దళాలను డ్రోన్లు, రోబోట్లతో భర్తీ చేయాలన్న ప్రణాళిక ఉందని చెప్పారు. యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమర్ జెలెన్స్కీ ప్రకారం, మూడు నెలల్లోనే 22వేలకుపైగా మిషన్లను డ్రోన్లు, రోబోట్లు నిర్వహించాయి. వీటి వల్ల వేలాది సైనికుల ప్రాణాలు దక్కించుకున్నారు. నాలుగేళ్లుగా కొనసాగుతున్న యుద్ధంలో యుక్రెయిన్‌ను డ్రోన్లు, రోబోటిక్ టెక్నాలజీలో ప్రపంచంలో ముందంజలో నిలిపింది. జనవరిలో మిఖాయిలో ఫెడోరోవ్ రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ రంగంలో మరింత పురోగతి సాధించారు. యుద్ధ వ్యూహంలో భాగంగా, సాంకేతికత, డేటా ఆధారంగా రష్యాపై ఆధిక్యం సాధించేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నారు.

Advertisement

వివరాలు

ప్రతి గగనతల ముప్పును గుర్తించాలి

యుక్రెయిన్ లక్ష్యం ఏమిటంటే... ప్రతి గగనతల ముప్పును గుర్తించి కనీసం 95 శాతం వరకు అడ్డుకోవడం. అలాగే యుద్ధరేఖ వెంట 15 నుంచి 20 కిలోమీటర్ల మేర 'కిల్ జోన్' సృష్టించి, డ్రోన్లు, రోబోట్లు నిరంతరం పనిచేసేలా చేయడం. అయితే భవిష్యత్తులో కృత్రిమ మేధస్సు(AI)పాత్రపై ఇంకా సందేహాలు ఉన్నాయి. పూర్తిగా ఆటోమేటిక్‌గా పనిచేసే ఆయుధాలపై జింకెవిచ్ ఆందోళన వ్యక్తం చేశారు. తుది నిర్ణయం ఎప్పటికీ మనుషులదే కావాలని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి పరిణామాలు చూస్తే... యుద్ధరంగంలో మానవ సైనికుల స్థానాన్ని రోబోలు, డ్రోన్లు ఆక్రమించే దిశగా ప్రపంచం వేగంగా కదులుతోంది.

Advertisement