NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / AI: సైబర్‌ మాయగాళ్ల వల..థాయ్‌లాండ్ దేశ ప్రధానే లక్ష్యంగా ఏఐ ఫోన్‌ కాల్‌
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    AI: సైబర్‌ మాయగాళ్ల వల..థాయ్‌లాండ్ దేశ ప్రధానే లక్ష్యంగా ఏఐ ఫోన్‌ కాల్‌
    సైబర్‌ మాయగాళ్ల వల..థాయ్‌లాండ్ దేశ ప్రధానే లక్ష్యంగా ఏఐ ఫోన్‌ కాల్‌

    AI: సైబర్‌ మాయగాళ్ల వల..థాయ్‌లాండ్ దేశ ప్రధానే లక్ష్యంగా ఏఐ ఫోన్‌ కాల్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 17, 2025
    10:22 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కృత్రిమ మేథస్సు (Artificial Intelligence) రోజురోజు అభివృద్ధి చెందుతూ అనేక రంగాలలో వినియోగించబడుతోంది.

    అయితే ఈ సాంకేతికత ద్వారా కొందరు మోసాలు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఏఐను ఉపయోగించి ప్రజల నుంచి ఆర్ధిక లాభం పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.

    కాగా సైబర్ మాయగాళ్లు ఏఐ ఫోన్ కాల్‌ను ఉపయోగించి దేశ ప్రధానిని (థాయ్‌లాండ్ ప్రధాని) మోసం చేయాలని యత్నించారు.

    సైబర్ నేరగాళ్లు ఏఐ సాయంతో పేటోంగ్టార్న్‌ షినవత్రా (PM Paetongtarn Shinawatra), థాయిలాండ్ ప్రధానిని ఫోన్‌లో మోసం చేయడానికి ప్రయత్నించారు.

    వివరాలు 

    సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది

    ఏఐ సహాయంతో సైబర్‌ నేరస్థులు తనకు ఫోన్‌కాల్‌ చేసి.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఓ లీడర్ గొంతుతో మాట్లాడి తనను నమ్మించడానికి ప్రయత్నించారని థాయ్‌లాండ్‌ ప్రధాన మంత్రి పేటోంగ్టార్న్‌ షినవత్రా పేర్కొన్నారు.

    అయితే, ఆమె ఈ మోసాన్ని వెంటనే గుర్తించగలిగింది. అయితే, ప్రధాని పదవిలో ఉన్న ఆమెకు ఇలాంటి కాల్ వస్తే, సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది అనే ఆందోళనను వ్యక్తం చేశారు.

    ఆమె తెలిపిన ప్రకారం, "ఏఐతో నేరాలు పెరిగిపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించిందని" పేటోంగ్టార్న్‌ అన్నారు.

    తనకు వచ్చిన కాల్ లో, "ఎలా ఉన్నారు? మీరు నాకు సహకరించాలని అనుకుంటున్నాను" అనే మాటలు ఒక స్పష్టమైన గొంతుతో వినిపించాయి. మొదట వాయిస్ మెసేజ్ వలయంగా వచ్చింది.

    వివరాలు 

    ఫోన్ కాల్ ఎక్కడినుంచి వచ్చిందనే దర్యాప్తు

    తనవంతుగా తిరిగి కాల్ చేయగా, అది కట్ అయ్యిందని ఆమె వివరించారు.

    అనంతరం, "ఆసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్"లోని ఇతర దేశాలన్నీ విరాళాలు ఇచ్చినప్పటికీ, థాయ్‌లాండ్ మాత్రం ఇవ్వలేదని, వాటిని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మరొక వాయిస్ మెసేజ్ వచ్చింది. ఈ సమయంలో, పేటోంగ్టార్న్‌ అవాక్కయ్యారని చెప్పారు.

    అయితే, ఈ ఫోన్ కాల్ ఎక్కడినుంచి వచ్చిందనే దర్యాప్తు జరుగుతున్నట్లు ఆమె తెలిపారు.

    ప్రజలు ఇలాంటి సైబర్ నేరగాళ్ల నుండి తప్పించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    థాయిలాండ్

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    థాయిలాండ్

    ఆ ఆరు దేశాల మీదుగా ప్రయాణిస్తున్నారా ? అయితే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి కరోనా కొత్త మార్గదర్శకాలు
    థాయ్‌లాండ్‌లో గ్యాంబ్లింగ్ ముఠా గుట్టు రట్టు; చికోటి ప్రవీణ్ అరెస్టు భారతదేశం
    వడగాలుల తీవ్రతకు మానవ తప్పిదాలే కారణమంటున్న శాస్త్రవేత్తలు  వాతావరణ మార్పులు
    Thailand visa free: ఇక వీసాకు పైసా చెల్లించకుండానే.. భారతీయులు థాయ్‌లాండ్‌కు వెళ్లొచ్చు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025