NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / రెండు రైళ్లు ఢీకొని 26 మంది మృతి; 85 మందికి గాయాలు
    తదుపరి వార్తా కథనం
    రెండు రైళ్లు ఢీకొని 26 మంది మృతి; 85 మందికి గాయాలు
    గ్రీస్‌లో రెండు రైళ్లు ఢీకొని 26 మంది మృతి

    రెండు రైళ్లు ఢీకొని 26 మంది మృతి; 85 మందికి గాయాలు

    వ్రాసిన వారు Stalin
    Mar 01, 2023
    09:51 am

    ఈ వార్తాకథనం ఏంటి

    గ్రీస్‌లోని టెంపేలో కార్గో రైలును ప్యాసింజర్ రైలు ఢీకొనడంతో 26 మంది మరణించారు. ఈ ప్రమాదంలో దాదాపు కనీసం 85 మంది గాయపడినట్లు అధికారులు చెప్పారు. మంగళవారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు.

    రెండు రైళ్లు ఢీకొనడంతో పలు కోచ్‌లు పట్టాలు తప్పాయని, మూడు కోచ్‌లు దగ్ధమయ్యాయని ప్రముఖ వార్తా సంస్థ అసోసియేట్ ప్రెస్ నివేదించింది.

    రెండు రైళ్లు బలంగా ఢీకొన్నాయని థెస్సాలీ ప్రాంత గవర్నర్ కాన్స్టాంటినోస్ అగోరాస్టోస్ వెల్లడించారు. ప్యాసింజర్ రైలులోని మొదటి నాలుగు కోచ్‌లు పట్టాలు తప్పాయని, అందులో రెండు కోచ్‌లు పూర్తిగా ధ్వంసమయ్యాయని వెల్లడించారు.

    రైలు ప్రమాదం

    ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు

    ప్రమాదం జరిగిన సమయలంలో ప్యాసింజర్ రైలులో దాదాపు 350మంది ప్రయాణికులు ఉన్నట్లు అగోరాస్టోస్ తెలిపారు. అందులో 250మంది ప్రయాణికులను సురక్షితంగా తరలించినట్లు అగోరాస్టోస్ వెల్లడించారు.

    సంఘటనా స్థలంలో సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు అగ్నిమాపక సేవా ప్రతినిధి పేర్కొన్నారు. దట్టమైన పొగ కమ్ముకోవడంతో హెడ్‌ల్యాంప్‌లను ధరించిన శిథిలాల కింద చిక్కుకున్న వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

    శిథిలాలను తొలగించేందుకు క్రేన్‌లను తెప్పించామని, సహాయక చర్యలు చేపట్టేందుకు సైన్యాన్ని సంప్రదించినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు.

    ప్రమాద తీవ్రత ఎక్కువ జరగడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రైల్వే శాఖ మంత్రి

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    రైల్వే శాఖ మంత్రి

    సంక్రాంతికి 94 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే తెలంగాణ
    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    సీసీ కెమెరా నిఘాలో రైల్వే కోచ్‌లు.. ఇక రైలు ప్రయాణం మరింత భద్రం భారతదేశం
    50వేల మందిని రాత్రికిరాత్రి బలవంతంగా ఖాళీ చేయించలేం: సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025