Hormuz: హోర్ముజ్ను తిరిగి తెరిచేందుకు అమెరికా యుద్ధ విమానాలు.. రంగంలోకి ఎ-10, అపాచీలు..!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ చమురు రవాణాకు కీలకంగా భావించే హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి అమెరికా కీలక ఆపరేషన్ను ప్రారంభించింది. ఈ చర్యలో భాగంగా తీర ప్రాంతాల్లో ఇరాన్ మోహరించిన క్షిపణి లాంచర్లు, డ్రోన్లు, వేగవంతమైన బోట్లు వంటి లక్ష్యాలను చేధించేందుకు తక్కువ ఎత్తులో ఎగిరే అపాచీ అటాక్ హెలికాప్టర్లు, యుద్ధ విమానాలను రంగంలోకి దింపినట్లు అమెరికా సైనిక వర్గాలు వెల్లడించాయి. ఈ విషయాన్ని అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ వెల్లడించినట్లు సమాచారం. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ ఏర్పాటు చేసిన సీమైన్స్, క్షిపణులు, బోట్లు వంటి ముప్పులను నిర్మూలించేందుకు ఈ ఆపరేషన్ను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
వివరాలు
ఇరాన్ దక్షిణ తీర ప్రాంతాల్లో ఉన్న ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్లను లక్ష్యంగా ఎ-10 విమానాలు
ఈ ప్రాంతంలో ఇరాన్ అమర్చిన అడ్డంకులను పూర్తిగా తొలగించేందుకు వారం కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. జలసంధి మూసివేత కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఒక్కసారిగా 119 డాలర్లకు పెరిగిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్లో భాగంగా అమెరికా భారీ ఆయుధాలతో ఎ-10 యుద్ధ విమానాలను మోహరించగా, అపాచీ హెలికాప్టర్లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి హర్మూజ్ జలసంధిపై అత్యల్ప ఎత్తులో ఎగిరుతూ శత్రు లక్ష్యాలను ఖచ్చితంగా దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా ఎ-10 విమానాలు ఇరాన్ దక్షిణ తీర ప్రాంతాల్లో ఉన్న ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
వివరాలు
మిత్ర దేశాల సహకారం కూడా..
ఈ ఆపరేషన్లో కొన్ని మిత్రదేశాలు కూడా అమెరికాకు మద్దతుగా నిలిచినట్లు జనరల్ డాన్ కెయిన్ తెలిపారు. అటాక్ డ్రోన్లను ఎదుర్కొనేందుకు అపాచీ హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నట్లు వెల్లడించినప్పటికీ, ఆ దేశాల పేర్లను వెల్లడించలేదు. గత కొంతకాలంగా ఎ-10 విమానాలు, అపాచీ హెలికాప్టర్లు ఈ ప్రాంతంలో సక్రియంగా పనిచేస్తున్నాయని తెలిపారు. వీటికి తోడు ఇప్పటికే ఫైటర్ జెట్లు కూడా మద్దతు ఇస్తున్నాయి. ఇప్పటివరకు సుమారు 120 నౌకలను ధ్వంసం చేసినట్లు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ పేర్కొన్నారు.
వివరాలు
పదాతి దళాలకు ఎ-10ల మద్దతు
ఎ-10 యుద్ధ విమానాలు సాధారణంగా పదాతి దళాలకు సమీప వైమానిక మద్దతు (క్లోజ్ ఎయిర్ సపోర్ట్) కోసం రూపొందించబడ్డాయి. అయితే ప్రస్తుతం వాటిని సముద్రంలోని శత్రు నౌకలను ధ్వంసం చేయడానికి వినియోగిస్తున్నారు. ఈ విమానాల ముందు భాగంలో 30 ఎంఎం గన్ ఉండగా, రెక్కలపై బాంబులు అమర్చబడి ఉంటాయి. ప్రస్తుతం ఇవి జోర్డాన్లోని కేంద్రాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. గతంలో ఐసిస్పై కూడా ఈ విమానాలను ఉపయోగించారు. ఇక మరోవైపు, దాదాపు 2,200 మంది అమెరికా మెరైన్ కమాండోలు ఈ యుద్ధంలో పాల్గొనేందుకు బయల్దేరారు. వీరు ఇరాన్ దక్షిణ తీరంలోని ద్వీపాలను స్వాధీనం చేసుకుని హర్మూజ్ జలసంధిపై నియంత్రణ సాధించాలన్నది అమెరికా వ్యూహంగా కనిపిస్తోంది.