Trump: 'రియల్ అగ్రిమెంట్' అయ్యే వరకు ఇరాన్ చుట్టూ బలగాలు: ట్రంప్ కీలక పోస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా, కొన్ని ప్రాంతాల్లో దాడులు ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం పూర్తిగా ముగిసే వరకు అమెరికా యుద్ధనౌకలు,బలగాలు ఇరాన్ పరిసరాల్లోనే కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. యుద్ధ ముగింపుకు సంబంధించి పూర్తి స్థాయి ఒప్పందం అమల్లోకి వచ్చేంత వరకు నౌకలు, విమానాలు, సైనిక సిబ్బంది అన్నీ ఇరాన్ చుట్టూ మోహరించబడతాయని ట్రంప్ తెలిపారు. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇదే సమయంలో అమెరికా సైన్యం విశ్రాంతిలో ఉండి, తదుపరి ఆదేశాల కోసం సిద్ధంగా ఉంటుందని చెప్పారు.
వివరాలు
ట్రంప్ టెహ్రాన్కు మరోసారి కఠిన హెచ్చరికలు
ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదని స్పష్టం చేశారు. అలాగే హర్మూజ్ జలసంధి తెరిచి, భద్రతతో కొనసాగాలని సూచించారు. ఇజ్రాయెల్ లెబనాన్పై చేసిన భారీ దాడుల నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తామని ఇరాన్ ప్రకటించింది. కాల్పుల విరమణ ఒప్పందం నుంచి తప్పుకుంటామని కూడా హెచ్చరించింది. ఈ పరిణామాలపై స్పందించిన ట్రంప్ టెహ్రాన్కు మరోసారి కఠిన హెచ్చరికలు చేశారు. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి. అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ భాగం కాదని పేర్కొంటూ ఇజ్రాయెల్ దాడులు కొనసాగించింది. ఈ దాడుల్లో వందలాది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై దాడులకు దిగింది. దీంతో ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.