LOADING...
US-Pak: పాకిస్తాన్‌కు ఝలక్‌ ఇచ్చిన అమెరికా.. పెషావర్ కాన్సులేట్‌ మూసివేత 
పాకిస్తాన్‌కు ఝలక్‌ ఇచ్చిన అమెరికా.. పెషావర్ కాన్సులేట్‌ మూసివేత

US-Pak: పాకిస్తాన్‌కు ఝలక్‌ ఇచ్చిన అమెరికా.. పెషావర్ కాన్సులేట్‌ మూసివేత 

వ్రాసిన వారు Sirish Praharaju
May 07, 2026
12:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా తమ దౌత్య సిబ్బంది భద్రతను ప్రధానంగా పరిగణలోకి తీసుకుని పెషావర్‌లో ఉన్న కాన్సులేట్‌ను దశలవారీగా మూసివేయాలని నిర్ణయించింది. ఖైబర్ పఖ్తూంఖ్వా ప్రాంతానికి సంబంధించిన దౌత్య కార్యకలాపాలను ఇస్లామాబాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయానికి బదిలీ చేస్తున్నట్లు మంగళవారం అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. సిబ్బంది భద్రతతో పాటు వనరులను సమర్థంగా వినియోగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. పెషావర్ కార్యాలయాన్ని మార్చినా, పాకిస్థాన్‌పై అమెరికా ప్రభుత్వ విధాన ప్రాధాన్యతల్లో ఎలాంటి మార్పు ఉండదని తెలిపింది. ఆర్థిక సంబంధాల బలోపేతం, ప్రాంతీయ భద్రత ప్రోత్సాహం, అమెరికా ప్రజల ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యాలతో ఖైబర్ పఖ్తూంఖ్వా ప్రజలు, స్థానిక అధికారులతో సంప్రదింపులు కొనసాగుతాయని వెల్లడించింది.

వివరాలు 

కాన్సులేట్‌లో 18 మంది అమెరికన్ సిబ్బంది

ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్‌లలో ఉన్న తమ దౌత్య కార్యాలయాలు, పాకిస్తాన్‌లోని అమెరికా మిషన్ ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది. ఆఫ్ఘన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న పెషావర్ కాన్సులేట్ ఇప్పటివరకు ఆఫ్ఘనిస్తాన్‌కు సంబంధించిన అమెరికా కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించింది. ఇది ముఖ్యమైన సరఫరా, దౌత్య కేంద్రంగా పనిచేసింది. ఆఫ్ఘనిస్తాన్‌కు భూమార్గం సులభతరం చేయడంలోనూ, ఆ ప్రాంతంలో ఉన్న అమెరికా పౌరులు,ఆఫ్ఘన్ జాతీయులకు సహాయం అందించడంలోనూ ఈ కార్యాలయం కీలకంగా నిలిచింది. ప్రస్తుతం ఈ కాన్సులేట్‌లో 18 మంది అమెరికన్ సిబ్బంది, 89 మంది స్థానిక సిబ్బంది పనిచేస్తున్నారు.

Advertisement