Loading...
Ceuta: సెయూటాకు వరదలా వచ్చిన వేల మంది.. రెండే రోజుల్లో ఎందుకు వెనక్కి వెళ్లారు?
సెయూటాకు వరదలా వచ్చిన వేల మంది.. రెండే రోజుల్లో ఎందుకు వెనక్కి వెళ్లారు?

Ceuta: సెయూటాకు వరదలా వచ్చిన వేల మంది.. రెండే రోజుల్లో ఎందుకు వెనక్కి వెళ్లారు?

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 01, 2026
04:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

మొరాకో-స్పెయిన్‌ సరిహద్దులో నెలకొన్న వలస సంక్షోభం అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. స్పెయిన్‌ ఆధీనంలోని సెయూటా నగరంలోకి మొరాకో నుంచి భారీ సంఖ్యలో చొరబడిన వలసదారులు ఇప్పుడు స్వచ్ఛందంగా తిరిగి వెనక్కి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ప్రాణాలకు తెగించి సరిహద్దు దాటిన వేలాది మంది ఎందుకు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారనే ప్రశ్నకు తాజాగా సమాధానాలు వెలుగులోకి వస్తున్నాయి.

వివరాలు

యూరప్‌కు కీలక ప్రవేశ ద్వారం

ఆఫ్రికా దేశాలు, యూరోపియన్‌ యూనియన్‌కు మధ్య ఉన్న ఏకైక భూ సరిహద్దు సెయూటా.

దీంతో ఆఫ్రికా నుంచి యూరప్‌కు వెళ్లాలనుకునే వలసదారులకు ఇది ప్రధాన ప్రవేశ మార్గంగా మారింది.

ఈ నేపథ్యంలో సముద్రాన్ని ఈదుకుంటూ, సరిహద్దు కంచెలను దాటి 60 వేల మందికిపైగా మొరాకో నుంచి సెయూటాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు.

వివరాలు

భద్రతా బలగాల కట్టుదిట్టమైన చర్యలు

రెండు రోజుల పాటు కొనసాగిన భారీ వలస ప్రయత్నాలను అడ్డుకునేందుకు స్పెయిన్‌ భద్రతా బలగాలు సెయూటా సరిహద్దుల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి.

వలసదారులను నిలువరించేందుకు బాష్పవాయువు (టియర్‌ గ్యాస్‌), జల ఫిరంగులు ప్రయోగించడంతో పాటు హెచ్చరికగా కొన్ని రౌండ్ల కాల్పులు కూడా జరిపాయి.

అదేవిధంగా ఇరు దేశాలు తమ సరిహద్దుల్లో భారీ సంఖ్యలో భద్రతా సిబ్బందిని మోహరించాయి.

ADVERTISEMENT

వివరాలు

పరిస్థితులు చూసి వెనక్కి..

మొరాకోలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అనేక మంది వలసదారులు కొండలపై నుంచి ఈ దృశ్యాలను గమనించారు.

సెయూటాలోకి ప్రవేశించడం అంత సులభం కాదని గ్రహించిన వారు క్రమంగా వెనుదిరగడం ప్రారంభించారు.

ఇక ఇప్పటికే సెయూటాలోకి చేరుకున్న పలువురు వలసదారులకు ఆహారం, తాగునీరు వంటి కనీస సదుపాయాలు కూడా అందలేదు.

చాలామంది రోడ్లపైనే రాత్రులు గడపాల్సి వచ్చింది.

ఈ పరిణామాల కారణంగా వరదలా వచ్చిన వలసదారుల్లో 45 వేల మంది గంటల వ్యవధిలోనే స్వచ్ఛందంగా మొరాకోకు తిరిగి వెళ్లిపోయారు.

ADVERTISEMENT

వివరాలు

ఖైదీల విడుదలతో పెరిగిన సంక్షోభం?

రెండు రోజుల క్రితం మొరాకో రాజు వేలాది మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటించి, చిన్నచిన్న నేరాల్లో శిక్ష అనుభవిస్తున్న వారిని మానవతా దృక్పథంతో విడుదల చేశారు.

వీరిలో కొందరే సరిహద్దు దాటి స్పెయిన్‌లోకి చొరబడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అలాగే జులై ప్రారంభంలో సముద్రం దాటి దేశంలోకి ప్రవేశించిన వలసదారులను సరైన న్యాయ ప్రక్రియ లేకుండా వెంటనే తిరిగి పంపొద్దని కోర్టు అధికారులను ఆదేశించింది.

ఈ రెండు పరిణామాలే తాజా వలస సంక్షోభానికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.

వివరాలు

67 మందికి పైగా మృతి

సరిహద్దు వద్ద జరిగిన తొక్కిసలాటలు, సముద్రంలో మునిగిపోయిన ఘటనల్లో ఇప్పటివరకు 67 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

ఈ ఘటనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా స్పందించారు. సెయూటాలో చోటుచేసుకున్న పరిణామాలను ప్రస్తావిస్తూ.. ఇది భయానక దృశ్యం.. దీన్ని గుర్తుంచుకోండి అని వ్యాఖ్యానించారు.

డెమోక్రాట్లు అధికారంలోకి వస్తే అమెరికాలోనూ ఇలాంటి పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని ఆయన ప్రజలను హెచ్చరించారు.

ADVERTISEMENT