BYD: వినియోగదారులకు బిగ్ షాక్.. మే 1 నుంచి 'బివైడి' కార్ల ధరల పెంపు
ఈ వార్తాకథనం ఏంటి
చైనా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ 'బివైడి' భారత మార్కెట్లో తన అన్ని మోడళ్ల ధరలను పెంచేందుకు సిద్ధమైంది. మే 1, 2026 నుంచి అమల్లోకి వచ్చే ఈ పెంపు సుమారు 2 నుంచి 3 శాతం వరకు ఉండనుంది. దీంతో వాహనం మోడల్ను బట్టి సుమారు రూ. 50,000 నుంచి రూ. 1 లక్ష వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు, గ్లోబల్ సరఫరా గొలుసు సమస్యలు ఈ నిర్ణయానికి కారణమని కంపెనీ తెలిపింది.
వివరాలు
అన్ని మోడళ్లపై ప్రభావం
ఈ ధరల పెంపు BYD భారత లైనప్లో ఉన్న అన్ని మోడళ్లకు వర్తించనుంది. ప్రస్తుతం కంపెనీ దేశంలో నాలుగు బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తోంది. వాటిలో BYD అటో 3 SUV, BYD eMAX 7 MPV, BYD సీల్ సెడాన్, BYD సీలియన్ 7 ప్రీమియం SUV ఉన్నాయి. ఇందులో ఎంట్రీ-లెవల్ మోడల్ ధర రూ. 24.99 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా, టాప్ మోడల్ ధర రూ. 54.9 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.
వివరాలు
ఆటోమొబైల్ రంగంలో ధరల పెంపు
2026 జనవరిలోనే BYD తన ఫ్లాగ్షిప్ మోడల్ సీలియన్ 7 బేస్ వేరియంట్ ధరను రూ. 50,000 మేర పెంచింది. అయితే అప్పట్లో ఇతర వేరియంట్ల ధరల్లో మార్పులు చేయలేదు. ఇప్పుడీ తాజా పెంపు మాత్రం అన్ని మోడళ్లను ప్రభావితం చేయనుంది. ఇదే సమయంలో హ్యుందాయ్, టాటా మోటార్స్ వంటి ఇతర ఆటోమొబైల్ కంపెనీలు కూడా పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు, గ్లోబల్ అనిశ్చిత పరిస్థితుల కారణంగా ధరలను పెంచుతున్నాయి. ఈ పరిణామాలు దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో ధరల పెంపు ధోరణి కొనసాగుతోందని సూచిస్తున్నాయి.