LOADING...
Delhi EV policy: ఢిల్లీ ఈవీ పాలసీ 2026: హైబ్రిడ్ కార్లకు గుడ్ న్యూస్.. ₹1.5 లక్షల వరకు తగ్గింపు!
₹1.5లక్షల వరకు తగ్గింపు!

Delhi EV policy: ఢిల్లీ ఈవీ పాలసీ 2026: హైబ్రిడ్ కార్లకు గుడ్ న్యూస్.. ₹1.5 లక్షల వరకు తగ్గింపు!

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 13, 2026
11:35 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈవీ పాలసీ 2026లో భాగంగా స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్ల కొనుగోలుదారులకు భారీ పన్ను సడలింపులు ఇవ్వాలని యోచిస్తోంది. రూ.30 లక్షల లోపు ధర కలిగిన హైబ్రిడ్ కార్లపై రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీలను 50 శాతం తగ్గించే ప్రతిపాదన ఉంది. ఇది అమల్లోకి వస్తే మారుతి సుజుకి, టయోటా, హోండా కంపెనీల మోడళ్ల ధరలు సుమారు ₹1.45 లక్షల వరకు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో హైబ్రిడ్ కార్లకు ఎలాంటి పన్ను రాయితీలు లేవు.

వివరాలు 

ఈ డ్రాఫ్ట్‌పై 30 రోజుల్లో అభిప్రాయాలు

₹10లక్షల పైబడిన కార్లపై 10 శాతం రోడ్ ట్యాక్స్ వసూలు చేస్తుండగా, రిజిస్ట్రేషన్ ఫీజు ₹600గా ఉంది. కొత్త పాలసీతో మారుతి విక్టోరిస్, గ్రాండ్ విటారా, ఇన్విక్టో, టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్, ఇన్నోవా హైక్రాస్, హోండా సిటీ ఈహెవీ వంటి మోడళ్లకు లాభం చేకూరనుంది. అయితే ఎలక్ట్రిక్ కార్లకు మాత్రం పూర్తిగా రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ మినహాయింపు కొనసాగనుండటంతో ఈవీలకు ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఏప్రిల్ 11న విడుదలైన ఈ డ్రాఫ్ట్‌పై 30 రోజుల్లో అభిప్రాయాలు ఆహ్వానించగా, తుది ఆమోదం తర్వాత 2030 మార్చి 31 వరకు ఇది అమల్లో ఉంటుంది. అలాగే రెండు చక్ర వాహనాలు, మూడు చక్ర వాహనాలు, కమర్షియల్ వాహనాల్లో ఎలక్ట్రిఫికేషన్‌ను కూడా ప్రభుత్వం ప్రోత్సహించనుంది.

Advertisement