Hyundai Motor: హ్యుందాయ్ గుడ్న్యూస్.. 'మైహ్యుందాయ్' యాప్లో 30 వేలకుపైగా చార్జింగ్ పాయింట్లు
ఈ వార్తాకథనం ఏంటి
ఈవీ వినియోగదారులకు హ్యుందాయ్ శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత సులభతరం చేసే దిశగా హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ 'మైహ్యుందాయ్' యాప్లో 30 వేలకుపైగా ఈవీ చార్జింగ్ పాయింట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్పై పనిచేసే దేశంలోని అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఈవీ చార్జింగ్ నెట్వర్క్లలో ఇది ఒకటిగా నిలిచింది. ఈ నెట్వర్క్ను రూపొందించేందుకు ప్రముఖ ఛార్జ్ పాయింట్ ఆపరేటర్లు (సీపీవోలు), సేవలందించే సంస్థలతో హ్యుందాయ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సేవల ప్రత్యేకత ఏమిటంటే.. ఇవి కేవలం హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కార్లకే పరిమితం కావు. భారతదేశంలో ఉన్న అన్ని బ్రాండ్ల ఎలక్ట్రిక్ వాహన యజమానులు కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.
వివరాలు
ప్రతి 25 కిలోమీటర్ల పరిధిలో ఒక చార్జింగ్ స్టేషన్
'మైహ్యుందాయ్' యాప్ ద్వారా సమీపంలోని చార్జింగ్ స్టేషన్ను గుర్తించడం, అక్కడికి నావిగేషన్ పొందడం, ముందుగానే చార్జింగ్ స్లాట్ను బుక్ చేసుకోవడం,ఆన్లైన్లో చెల్లింపులు పూర్తి చేయడం వంటి సేవలను ఒకే చోట పొందే అవకాశం ఉంటుంది.
ఈ ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్ కారణంగా దేశవ్యాప్తంగా సగటున ప్రతి 25 కిలోమీటర్ల పరిధిలో ఒక చార్జింగ్ స్టేషన్ అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
అలాగే ఢిల్లీ-జైపూర్, ముంబై-పూణే-బెంగళూరు, హైదరాబాద్-కర్నూలు-బెంగళూరు వంటి కీలక జాతీయ రహదారి కారిడార్లలో కూడా ఈ చార్జింగ్ సదుపాయాలను విస్తరించినట్లు హ్యుందాయ్ తెలిపింది.
దీంతో సుదూర ప్రయాణాలు చేసే ఈవీ వినియోగదారులకు చార్జింగ్ సౌకర్యం మరింత సులభంగా లభించనుంది.
వివరాలు
'మైహ్యుందాయ్' యాప్లో 30 వేలకుపైగా చార్జింగ్ పాయింట్లు
ఈ సందర్భంగా హెచ్ఎంఐఎల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ తరుణ్ గర్గ్ మాట్లాడుతూ, భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణకు బలమైన చార్జింగ్ మౌలిక సదుపాయాలు అత్యంత కీలకమని అన్నారు.
'మైహ్యుందాయ్' యాప్లో 30 వేలకుపైగా చార్జింగ్ పాయింట్లను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురావడం ద్వారా దేశంలోని అతిపెద్ద ఈవీ చార్జింగ్ నెట్వర్క్లలో ఒకదాన్ని వినియోగదారులకు అందిస్తున్నామని తెలిపారు.
ఈ సేవలను అన్ని బ్రాండ్ల ఎలక్ట్రిక్ వాహన యజమానులకు అందుబాటులో ఉంచడం ద్వారా భారత ఈవీ ఎకోసిస్టమ్ అభివృద్ధికి తమ నిబద్ధతను మరోసారి చాటుతున్నామని పేర్కొన్నారు.
వివరాలు
2030 నాటికి చార్జింగ్ స్టేషన్ల సంఖ్య 600కు పెంచాలని లక్ష్యం
ఇదే సమయంలో కంపెనీ తన సొంత డీసీ ఫాస్ట్ పబ్లిక్ చార్జింగ్ నెట్వర్క్ను కూడా మరింత విస్తరించే ప్రణాళికను అమలు చేస్తోంది.
ప్రస్తుతం ఉన్న 183 చార్జింగ్ స్టేషన్ల సంఖ్యను 2030 నాటికి 600కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
హ్యుందాయ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు తమ చార్జింగ్ మౌలిక సదుపాయాల ద్వారా 3 లక్షలకు పైగా చార్జింగ్ సెషన్లు నమోదయ్యాయి.
దీని వల్ల సుమారు 3.5 మిలియన్ కిలోల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించగలిగినట్లు కంపెనీ తెలిపింది.
మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే సామాన్య వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీని మార్కెట్లోకి తీసుకురావడానికి హ్యుందాయ్ సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించింది.