LOADING...
India-UK FTA: 15 ఏళ్లలో 3.78 లక్షల బ్రిటన్ కార్ల దిగుమతికి గ్రీన్ సిగ్నల్
15 ఏళ్లలో 3.78 లక్షల బ్రిటన్ కార్ల దిగుమతికి గ్రీన్ సిగ్నల్

India-UK FTA: 15 ఏళ్లలో 3.78 లక్షల బ్రిటన్ కార్ల దిగుమతికి గ్రీన్ సిగ్నల్

వ్రాసిన వారు Moogati Shabari
Jun 18, 2026
12:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య భాగస్వామ్య ఒప్పందం (CETA) అమల్లోకి వచ్చిన తొలి 15 ఏళ్లలో యూకే నుంచి 3.78 లక్షల సంప్రదాయ ఇంజిన్ ప్యాసింజర్ కార్ల దిగుమతికి భారత్ రాయితీ కస్టమ్స్ సుంకంతో అనుమతి ఇవ్వనుంది. ఇందులో మాస్ మార్కెట్ విభాగానికి చెందిన కార్లు కూడా ఉన్నాయి. ఈ ఒప్పందం ప్రకారం ఆటో మొబైల్ దిగుమతులపై ప్రస్తుతం ఉన్న సుమారు 110 శాతం సుంకం కోటా విధానంతో దశలవారీగా 10 శాతానికి తగ్గనుంది.

వివరాలు

ఇరు దేశాల మధ్య ఒప్పందం..

బుధవారం విడుదలైన భారత్-యూకే CETA పత్రం ప్రకారం.. ఆరో సంవత్సరం నుంచి జీబీపీ 20,000 నుంచి జీబీపీ 80,000 ధరల శ్రేణిలోని ఎలక్ట్రిక్, హైబ్రిడ్, హైడ్రోజన్ ప్యాసింజర్ కార్లను భారత్ సుంకం లేకుండా యూకేకు ఎగుమతి చేసే అవకాశం లభించనుంది. ఈ కోటా 15వ సంవత్సరం నుంచి గరిష్ఠంగా 88 వేల యూనిట్లకు చేరుకుని, ఆ తర్వాత కూడా అదే స్థాయిలో కొనసాగుతుంది. ఈ నిర్ణయం వల్ల టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి వంటి భారతీయ వాహన తయారీ సంస్థలకు ప్రయోజనం చేకూరనుంది. ఇరు దేశాలు ఈ సమగ్ర ఆర్థిక, వాణిజ్య భాగస్వామ్య ఒప్పందాన్ని (CETA) జూలై 15 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి.

వివరాలు

ఎంత మేరకు తగ్గుతుందంటే?

యూకే నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే సంప్రదాయ ఇంజిన్ ప్యాసింజర్ కార్ల విషయంలో ఐదో సంవత్సరానికి కోటా 37 వేల యూనిట్ల గరిష్ఠ స్థాయికి చేరనుంది. అప్పటికి కస్టమ్స్ సుంకం తుది స్థాయిగా 10 శాతానికి తగ్గుతుంది. ఆ తర్వాత దీనిలో మరింత తగ్గింపు ఉండదు. మొదటి సంవత్సరంలో 3,000 సీసీకి పైబడిన పెట్రోల్ కార్లు, 2,500 సీసీకి పైబడిన డీజిల్ కార్లకు 10 వేల యూనిట్ల దిగుమతి కోటా ఉంటుంది. వీటిపై కస్టమ్స్ సుంకం 110 శాతం నుంచి 30 శాతానికి తగ్గనుంది. 1,500 సీసీ పెట్రోల్, 2,500 సీసీ డీజిల్, 3,000 సీసీ పెట్రోల్ ఇంజిన్ సామర్థ్యం గల కార్లకు 5 వేల యూనిట్ల కోటా నిర్ణయించారు.

Advertisement

వివరాలు

20 వేల ప్యాసింజర్ కార్ల దిగుమతికి అనుమతి..

1,500 సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యం ఉన్న మాస్ మార్కెట్ కార్లకు కూడా తొలి ఏడాదిలో 5 వేల యూనిట్ల దిగుమతి కోటా ఉంటుంది. మూడు కేటగిరీల్లో తొలి ఏడాదిలో మొత్తం 20 వేల ప్యాసింజర్ కార్ల దిగుమతికి అనుమతి ఉంటుంది. ఐదో సంవత్సరానికి 3,000 సీసీకి పైబడిన పెట్రోల్, 2,500 సీసీకి పైబడిన డీజిల్ కార్ల దిగుమతి కోటా 19 వేల యూనిట్లకు పెరుగుతుంది. 1,500 సీసీ పెట్రోల్, 2,500 సీసీ డీజిల్, 3,000 సీసీ పెట్రోల్ కార్లకు 9 వేల యూనిట్ల కోటా ఉంటుంది. అలాగే 1,500 సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యం ఉన్న కార్లకు కూడా 10 శాతం రాయితీ సుంకంతో అదే తరహా కోటా అమల్లో ఉంటుంది.

Advertisement

వివరాలు

హైడ్రోజన్ ప్యాసింజర్ కార్లపై కస్టమ్స్ సుంకం..

మొదటి ఐదేళ్లలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్, హైడ్రోజన్ ప్యాసింజర్ కార్లకు భారత్ ఎలాంటి సుంక రాయితీ ఇవ్వదు. అయితే ఆరో సంవత్సరం నుంచి జీబీపీ 40 వేల నుంచి జీబీపీ 80 వేల (CIF) మధ్య ధర ఉన్న వాహనాలపై కస్టమ్స్ సుంకాన్ని 50 శాతానికి తగ్గిస్తారు. వీటి దిగుమతి కోటా 400 యూనిట్లు ఉంటుంది. జీబీపీ 80 వేల (CIF) కంటే ఎక్కువ ధర ఉన్న వాహనాలపై సుంకం 40 శాతానికి తగ్గి, 4 వేల యూనిట్ల దిగుమతికి అనుమతి ఉంటుంది. పదో సంవత్సరానికి ఈ రెండు ధరల శ్రేణిలోని ఎలక్ట్రిక్, హైబ్రిడ్, హైడ్రోజన్ ప్యాసింజర్ కార్లపై కస్టమ్స్ సుంకం 10 శాతానికి స్థిరపడుతుంది.

Advertisement