Jeep Meridian: జీప్ మెరిడియన్ 85వ వార్షికోత్సవ ఎడిషన్ భారత్లో విడుదల.. ధర రూ.36.05 లక్షలు
ఈ వార్తాకథనం ఏంటి
జీప్ తన 85 ఏళ్ల వారసత్వాన్ని పురస్కరించుకుని భారత్లో మెరిడియన్ 85వ యానివర్సరీ ఎడిషన్'ను విడుదల చేసింది. కలెక్టర్ ఎడిషన్గా తీసుకొచ్చిన ఈ ప్రత్యేక మోడల్ ప్రీమియం ఓవర్ల్యాండ్ వేరియంట్ ఆధారంగా రూపొందించారు. దేశవ్యాప్తంగా కేవలం 85 యూనిట్లను మాత్రమే విక్రయానికి అందుబాటులో ఉంచనున్నట్లు కంపెనీ తెలిపింది. భారత్లో ప్రీమియం ఎస్యూవీ విభాగంలో కంపాస్,మెరిడియన్, రాంగ్లర్,గ్రాండ్ చెరోకీ వంటి మోడళ్లతో జీప్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ ప్రత్యేక ఎడిషన్ ప్రారంభ ధర రూ.36.05 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఇందులో గ్లోస్ బ్లాక్ 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, మయాన్ గోల్డ్ ఆకర్షణలతో పూర్తిగా బ్లాక్ ఇంటీరియర్, ప్రత్యేక కాంట్రాస్ట్ డిజైన్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.
వివరాలు
ఈ ప్రత్యేక ఎడిషన్లో స్టెలాంటిస్ అభివృద్ధి చేసిన CARA AI వాయిస్ అసిస్టెంట్
అలాగే 85వ యానివర్సరీ ఏఎక్స్ఎస్ ప్యాకేజీల ద్వారా కార్పెట్ ఫ్లోర్ మ్యాట్స్,యానివర్సరీ డీకల్ కిట్, అంబియంట్ లైటింగ్,స్కై లౌంజ్ సన్రూఫ్ ఇల్యూమినేషన్ వంటి అదనపు కస్టమైజేషన్ ఎంపికలను వినియోగదారులు పొందవచ్చు.
ఈ ప్రత్యేక ఎడిషన్లో స్టెలాంటిస్ అభివృద్ధి చేసిన CARA AI వాయిస్ అసిస్టెంట్ను కూడా తొలిసారిగా అందిస్తున్నారు.
ఈ ఏఐ సహాయక వ్యవస్థ ద్వారా వాహనంతో సహజంగా వాయిస్ ద్వారా మాట్లాడవచ్చు.
నావిగేషన్, రిమైండర్లు, వాతావరణ సమాచారం, కాల్స్, మ్యూజిక్, సాధారణ ప్రశ్నలకు సమాధానాలు, అలాగే కొన్ని వాహన నియంత్రణలను వాయిస్ కమాండ్లతో నిర్వహించే వీలుంది.
ఇది భారతీయ భాషలతో పాటు మొత్తం 52 భాషలకు మద్దతు ఇస్తుంది.