Loading...
Maruti Suzuki: జపాన్‌లో 'మేడ్‌ ఇన్‌ ఇండియా' కార్ల జోరు.. లక్ష యూనిట్లు దాటిన ఎగుమతులు!
జపాన్‌లో 'మేడ్‌ ఇన్‌ ఇండియా' కార్ల జోరు.. లక్ష యూనిట్లు దాటిన ఎగుమతులు!

Maruti Suzuki: జపాన్‌లో 'మేడ్‌ ఇన్‌ ఇండియా' కార్ల జోరు.. లక్ష యూనిట్లు దాటిన ఎగుమతులు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 15, 2026
12:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌లో తయారైన మారుతీ సుజుకీ వాహనాలు జపాన్‌ మార్కెట్‌లో సత్తా చాటుతున్నాయి. జిమ్నీ 5-డోర్‌, ఫ్రాంక్స్‌, ఈ-విటారా మోడళ్లను భారత్‌ నుంచి జపాన్‌కు ఎగుమతి చేసిన సంఖ్య లక్ష యూనిట్ల మైలురాయిని దాటినట్లు మారుతి సుజుకి ప్రకటించింది. ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్‌ ప్రాధాన్యం పెరుగుతోందనడానికి ఈ విజయం నిదర్శనమని కంపెనీ తెలిపింది. 2024లో ఎగుమతులు ప్రారంభం మారుతి సుజుకి ఈ మూడు మోడళ్లను జపాన్‌కు ఎగుమతి చేయడం 2024 ఆగస్టులో ఫ్రాంక్స్‌తో ప్రారంభించింది. అనంతరం 2024 డిసెంబరులో జిమ్నీ 5-డోర్‌ ఎగుమతులు మొదలయ్యాయి.

వివరాలు

ఎలక్ట్రిక్‌ వాహనం కూడా..

మారుతీ సుజుకీ తొలి బ్యాటరీ ఎలక్ట్రిక్‌ వాహనం (BEV) ఈ-విటారాను 2025 సెప్టెంబరులో జపాన్‌కు ఎగుమతి చేసే మోడళ్ల జాబితాలో చేర్చింది.

ఈ-విటారా చేరికతో సుజుకి గ్లోబల్‌ తయారీ కేంద్రంగా భారత్‌ స్థానం మరింత బలపడిందని కంపెనీ పేర్కొంది.

మేడ్‌ ఇన్‌ ఇండియా వాహనాలకు జపాన్‌లో పెరుగుతున్న ఆదరణతో.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతి పరిమాణం పరంగా జపాన్‌ మారుతి సుజుకికి రెండో అతిపెద్ద ఎగుమతి మార్కెట్‌గా నిలిచింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలలు.. అంటే ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు కూడా జపాన్‌ ఇదే స్థానంలో కొనసాగింది.

వివరాలు

భారత తయారీ సామర్థ్యానికి గుర్తింపు

మారుతీ సుజుకీ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ 'హిసాషి టకేఉచి' మాట్లాడుతూ.. జపాన్‌కు లక్షకు పైగా వాహనాలను ఎగుమతి చేయడం భారత తయారీ సామర్థ్యానికి లభించిన బలమైన గుర్తింపని అన్నారు.

ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన, కఠినమైన ఆటోమొబైల్‌ మార్కెట్లలో జపాన్‌ ఒకటని ఆయన పేర్కొన్నారు.

అలాంటి మార్కెట్‌లో భారత్‌లో తయారైన వాహనాలకు లభిస్తున్న ఆదరణ ఈ విజయాన్ని మరింత ప్రత్యేకంగా నిలిపిందని తెలిపారు.

జిమ్నీ 5-డోర్‌, ఫ్రాంక్స్‌, ఈ-విటారా మోడళ్ల విజయంతో సుజుకి మోటార్‌ కార్పొరేషన్‌ గత ఆర్థిక సంవత్సరంలో జపాన్‌లో అత్యధిక వాహనాలను దిగుమతి చేసుకున్న సంస్థగా నిలిచిందని మారుతి సుజుకి వెల్లడించింది.

ADVERTISEMENT